ఢిల్లీలోని వాయు కాలుష్యం అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ రాష్ట్రప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. వాయు కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా.. కాలుష్యం మాత్రం తగ్గడంలేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కోంది. రోజురోజుకూ కాలుష్యం పెరుగుతోందే కానీ నియంత్రణ చర్యలు ఫలితం కనబడటం లేదని.. అయితే ఈ క్రమంలో సమయం మాత్రం వృధా అవుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విచారణ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. గత కొన్ని వారాల నుంచి ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు ఏమీ చేయడం లేదన్న ఆలోచన వస్తోందని విచారణ సమయంలో సీజే ఎన్వీ రమణ అన్నారు.
రెండు ప్రభుత్వాలకు కేవలం 24 గంటల సమయం ఇస్తున్నామని ఈ లోగా కఠిన చర్యలు తీసుకుని వాయుకాలుస్యాన్ని నియంత్రించే చర్యలకు చేపట్టాని సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. పరిశ్రమలు, వాహనాల ద్వారా వచ్చే కాలుష్యంపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొన్నది. కఠిన కాలుష్య నియంత్రణ ప్రణాళికలను వెల్లడించాలని కోర్టు డెడ్లైన్ పెట్టింది. స్కూళ్లు తెరిచిన అంశంపై సీజే రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లు, నాలుగేళ్ల చిన్నారులు స్కూళ్లకు వెళ్తున్నారని, కానీ పెద్దలు మాత్రం వర్క్ఫ్రమ్హోమ్ చేస్తున్నారని, ఇది సరిగా లేదని కేజ్రీ ప్రభుత్వంపై సీజే సీరియస్ అయ్యారు. మీ ప్రభుత్వ పాలనను నియంత్రించేందుకు ఒకరిని నియమిస్తామని కోర్టు చెప్పింది.
అయితే పాఠశాలల తెరిచినా.. విద్యార్థులకు అప్షనల్ గా అన్ లైన్ విద్యను కూడా అందిస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వం తరుపున అభిషేక్ మను సింఘ్వీ న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన జస్టిస్ ఎన్వీ రమణ.. మీరు అప్షనల్ అంటున్నారు.. అయినా ఇంట్లో కూర్చోవాలని ఎవరికి ఉంటుంది.? కరోనా మహమ్మారి నేపథ్యంలో చిన్నారులు, పెద్దల అందరూ ఎదుర్కోంటున్న సమస్యలు మాకు తెలుసు. మాకు పిల్లలు, మనవళ్లు వున్నారు అని న్యాయమూర్తి జస్టిస్ రమణ అన్నారు. మీకు కేవలం 24 గంటల సమయాన్ని మాత్రమే ఇస్తున్నా. ఈలోగా వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని అదేశించించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more