కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గత సంవత్సరం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో సింఘు, టిక్రీ ప్రాంతాలలో గత ఎనమిది నెలలుగా రైతులు చేపట్టిన ఉద్యమం కొనసాగుతోంది. కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిసెంబర్ 26 నుంచి రైతులు తమ సంక్షేమాన్ని కాంక్షించే రైతు సంఘాలతోఈ ఉద్యమాన్ని కోనసాగిస్తునే వున్నారు. చలికి వణుకుతూ, ఎండలకు ఎండుతూ.. వర్షాలకు తడుస్తూ.. ఎట్టిపరిస్థితుల్లో తాము వెనక్కి తగ్గేది లేదని రైతన్నలు తెగేసి చెబుతున్నారు. ఇక కరోనా లాంటి కష్టకాలంలోనూ రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. దీక్షాస్థలితోనే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కోసం దీక్షను వదిలేస్తే.. సాగు బిల్లులతో తమ భవిష్యత్తే అంధకారం అవుతుందని, ఇలాంటి తరుణంలో తాము దీక్షను కొనసాగించేందుకే సముఖంగా వున్నామని రైతులు తెలిపారు. కాగా, ఈ సెప్టెంబర్ 25తో తొమ్మిది నెలలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు నిరసనగా గత ఏడాది నవంబర్ నుంచి జరుగుతున్న ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు బంద్కు పిలుపు ఇచ్చామని ఎస్కేఎం వెల్లడించింది.
సింఘు బోర్డర్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్కేఎం ప్రతినిధి అశీష్ మిట్టల్ మాట్లాడుతూ భారత్ బంద్ వివరాలను తెలిపారు. గత ఏడాది ఇదే రోజున తాము దేశవ్యాప్త బంద్ను జరిపామని గుర్తు చేశారు. కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న సమయంలో గత ఏడాది జరిగిన బంద్ కంటే ఈసారి భారత్ బంద్ మరింత విజయవంతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునకు సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు కూడా పలు రాజకీయ పార్టీలు ముందుకు రానున్నాయి. మరీ ముఖ్యంగా యూపీఏ పక్ష పార్టీలు రైతులకు మద్దతు తెలుపనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more