ప్రపంచాన్ని అతలాకుళం చేస్తున్న కరోనా వైరస్ నుంచి మానవాళి ఇప్పటికీ అందోళనలో చిక్కకుని.. బయటపడేందుకు మార్గాలను అన్వేషిస్తూనే వుంది. ఈ క్రమంలో రూపాంతరం చెందుతున్న కరోనా వేరియంట్ల నుంచి ప్రజలు సురక్షితంగా బయటపడక ముందే ఆఫ్రికాలో బయటపడిన మరో ప్రాణాంతక వైరస్ కరోనా కన్నా మహాడేంజర్ అని స్పష్టం అవుతోంది. కరోనా వైరస్ కనీసం చికిత్సకు అవకాశామైనా కల్సిస్తుండగా, తాజాగా పశ్చిమాసియాలోని గినియా దేశంలో బయటపడిన మార్బర్గ్ వైరస్ సోకిన వ్యక్తి ఒక్క రోజు వ్యవధిలోనే మృత్యువాత పడటం భయాందోళనను రేకెత్తిస్తోంది.
ఎబోలా జాతికి చెందిన ఈ వైరస్ కరోనా తరహాలోనే అత్యంత వేగంగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఈ వైరస్ సోకిన వారిలో 24 శాతం నుంచి 88 శాతం వరకు చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రారంభంలోనే ఈ వైరస్ కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇది గబ్బిలాల్లో వ్యాపించే వైరస్ అని.. వాటి నుంచి మనుషులకు ఇది సోకి ఉంటుందని చెప్పింది. రోసెట్టస్ గబ్బిలాలు ఉండేఆవాసాలకు సమీపంలోకి వెళ్లే వారికి ఈ వైరస్ సోకుతుందని చెప్పింది. ఈ వైరస్ మనుషులకు సోకిన తర్వాత ఇతరులకు సులువుగా వ్యాపిస్తుందని తెలిపింది.
గినియాలోని గేక్కేడౌలో మార్బర్గ్ వైరస్ బారినపడి ఈ నెల 2న ఓ వ్యక్తి మరణించాడు. అతడు అంతకుముందు రోజే ఆ వైరస్ బారినపడ్డటం మరింత అందోళన కలిగించే అంశం. సదరు బాధితుడికి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మార్బర్గ్ వైరస్ బారిన పడినవారు ఏడు రోజులపాటు తీవ్ర ప్రభావానికి గురవుతారని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. దీనివల్ల రక్తనాళాలు కూడా చిట్లిపోతాయి. ఎబోలా జాతికి చెందిన మార్బర్గ్ వైరస్ కు ఇప్పటి వరకు ఎలాంటి చికిత్స లేదని, దీనికి కనీసం వాక్సీన్ కూడా కనుగోనలేదని డబ్యూహెచ్ఓ తెలిపింది.
గేక్కేడౌలో మార్బర్గ్ వైరస్ బారిన పడిన వ్యక్తికి వైరస్ సోకిన తరువాత అతనితో సన్నిహితంగా మెలిగిన 155 మందిని గెనియా ప్రభుత్వం ఐసోలేట్ చేసి వారి అరోగ్యాన్ని పరిశీలిస్తోందని డబ్యూహెచ్ఓ తెలిపింది. వైరస్ బారిన పడిన వారు ఉపయోగించిన వస్తువుల ద్వారా ఇది ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని చెప్పింది. మార్బర్గ్ వైరస్ సోకగానే తీవ్ర జ్వరం, విపరీతమైన తలనొప్పి, చికాకు కలుగుతాయి. ఈ వైరస్ కు వ్యాక్సిన్, చికిత్స లేదు. అయితే, ఆయా లక్షణాలకు ప్రత్యేకంగా చికిత్సను అందించడం ద్వారా బాధితుడి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా, కాంగో, కెన్యా, ఉగాండా, అంగోలా దేశాల్లో కూడా ఈ వైరస్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more