Police issue notice to hero Tanish over drugs case డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో తనిష్ కు నోటీసులు

Telugu hero tanish lands in bengaluru drugs scandal police serves notice

drugs scandal, Bengaluru East Zone police, Summons, Hero Tanish, Telugu Producer, Telugu Industrialist, Bigg Boss contestant, Mastan Chandra, bengaluru, karnataka, crime

The Bengaluru East Zone police have issued summons to Telugu actor Tanish, a producer, and three others in connection with their alleged role in a narcotics ring. The five are to present themselves for questioning.

ITEMVIDEOS: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో తనిష్ కు నోటీసులు

Posted: 03/13/2021 11:26 AM IST
Telugu hero tanish lands in bengaluru drugs scandal police serves notice

రాష్ట్రంలో 2017లో డ్రగ్స్ కేసు వివాదం రేగిన నేపథ్యంలో అందులో తన పేరు పోందుపర్చుకున్న హీరో తాజాగా కర్ణాటక పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. కర్ణాటకలో ఇటీవల కలకలం రేపిన డ్రగ్స్ కేసులో విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు సినీప్రముఖులు అరెస్టై బెయిల్ పై కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ తీసుకుంటున్న వారిని మానసిక రోగులుగా పరిగణించి వదిలివేయగా.. డ్రగ్స్ అమ్ముతున్నవారిపై మాత్రం కొరడా ఝుళిపించింది. దీంతో రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మాకాలు కాసింత తగ్గుముఖం పట్టాయి.

అయితే డ్రగ్స్ అలావాటు వున్న బాడాబాబులు వీటికి అలవాటు పడి ఎక్కడ లభిస్తే అక్కడికి వెళ్లి వీటిని కొనుగోలు చేస్తున్నారు. తద్వారా వాటిని అస్వాదిస్తున్నారు. అయితే ఈ వ్యవహరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కర్ణాటక పోలీసులు తమకు లభించిన డ్రగ్స్ రాకెట్ సూత్రధారులైన అఫ్రికా దేశస్థులను అరెస్టు చేసి.. వాటి నుంచి రాబట్టిన సమాచారం మేరకు అరెస్టుల పర్వాలను కొనసాగిస్తున్నారు. వీరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి.. పలువురికి విక్రయిస్తున్న కన్నడ నాట మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ మస్తాన్ చంద్రా అని తెలుసుకున్న పోలీసులు అతడితో పాటు అతని అనుచరులను కూడా అరెస్టు చేసి.. వారి విచారణలో వెల్లడించిన వివరాలతో పాటు వారి ఫోన్ నెంబర్లు, లాప్ టాప్ ల ఆధారంగా అరెస్టులను కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో శాండిల్ వుడ్ ప్రోడ్యూసర్ సహా పలువురిని ఇళ్లపై దాడులు చేసిన పోలీసులకు వారిళ్లలో ఏలాంటి డ్రగ్స్ లభ్యం కాకపోవడంతో అరెస్టులు చేయలేదు. అయితే తమకు అందిన సమాచారం మేరకు తాజాగా టాలీవుడ్ నటుడు తనీష్‌కు బెంగళూరు పోలీసులు సమన్లలు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ మొత్తం ఐదుగురికి నోటీసులు ఇవ్వగా అందులో ఓ సినీ  నిర్మాత, పారిశ్రామికవేత్త కూడా ఉన్నారు. తనీష్ కు నోటీసులు పంపినట్టు బెంగళూరు పోలీసులు ధ్రువీకరించారు. 2017లో అప్పట్లో తెలుగు చిత్రపరిశ్రమను ఊపేసిన డ్రగ్స్ కేసులోనూ తనీష్ సిట్ ఎదుట హాజరయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles