తెలంగాణలోని పలు జిల్లాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్ దొంగలకు నిజామాబాద్ జిల్లాలోని న్యాయస్థానం ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. జిల్లాలో మారణాయుధాలు చేతబట్టి పలు చోట్ల దొంగతనాలకు పాల్పడి.. దొంగలు ఆ తరువాత పోలీసులకు చిక్కారు. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిచిన న్యాయస్థానంలో ప్రవేశపెట్టడంతో ఈ కేసును విచారించిన న్యాయస్థానం వారిని దోషులగా తేల్చింది. ఇక ఈ కేసులో తీర్పును వెలువరించిన న్యాయస్థానం దోషులకు ఏడేళ్ల కఠిన కారాగారశిక్షను విధిస్తూ తీర్పునచ్చింది. ఇక ఈ కేసులోని దోషులందరూ మహారాష్ట్రకు చెందిన వారే కావడం గమనార్హం.
ఈ మేరకు నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు తీర్పును వెలువరించింది. దీంతో ఇప్పటికే దొంగతనం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దొంగలకు ఆ శిక్షతో పాటు ఈ శిక్షను కూడా అమలు చేయబడుతోంది. కేసు వివరాల్లోకి వెళ్తే.. 4 నవంబరు 2019లో నిజామాబాదులోని లలితానగర్ లో నివాసముంటున్న పెద్ద తిమ్మయ్య ఇంట్లో చెడ్డీగ్యాంగ్ ముఠా మారణాయుధాలతో ప్రవేశించి 15 తులాల బంగారం అపహరించింది. దొంగతనం గురించి మరుసటి రోజున తెలుసుకన్న బాధితులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సిసిటీవీ కెమెరాలతో పాటు క్లూస్ టీ కూడా రంగంలోకి దిగి వేలిముద్రలను, తదితర సాక్ష్యాలను సేకరించింది.
ఇక ఏ జిల్లాలోనే ఎక్కువ రోజులు వుండని చోరులు.. జిల్లాలను మార్చుతూ దోంగతనాలకు పాల్పడుతుండేవారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ సాగించినా ఫలితం లేకపోయింది. అయితే, అదే ఏడాది డిసెంబరు 29న ఓ చోరికి పాల్పడేందుకు వెళ్లిన చెడ్డీ గ్యాంగ్ ముఠాను రాచకొండ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో వారు నిజామాబాద్లోనూ దొంగతనం చేసినట్టు అంగీకరించారు. దీంతో ఈ కేసులో వాదనలు విన్న సెషన్స్ కోర్టు జడ్జి కిరణ్మయి.. ముఠాలోని ఆరుగురు సభ్యులకు ఏడేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మరో నిందితుడు ఎండీ సాజిద్పై నేరం నిరూపణ కాకపోవడంతో అతడిపై నమోదైన కేసును కొట్టివేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more