గత కొంతకాలంగా హైదరాబాద్ నగరవాసులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కే.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మీ హైదరాబాద్ నూతన నగర మేయర్ గా ఎన్నికయ్యారు. మేయర్ పదవి కోసం బీజేపి తరపున అర్కేపురం డివిజన్ నుంచి ఎన్నికైన రాధా ధీరజ్ రెడ్డి నామినేషన్ వేయడంతో మేయర్ పదవికి ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో ఎన్నికలు జరిగిన అనంతరం అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన బంజారాహిల్స్ కార్పోరేటర్ విజయలక్ష్మీ నగర నూతన మేయర్ గా ఎన్నికయ్యారు.
మేయర్ ఎన్నికలలో ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో ఎన్నికల లాంఛనంగానే మారింది. మేయర్ పదవితో పాటు డిఫ్యూటీ మేయర్ పదవులను కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఎన్నికయ్యారు. డిఫ్యూటీ మేయర్ పదవికి తార్నక కార్పోరేటర్ మోతె శ్రీలత విజయం సాధించారు. దీంతో జీహెచ్ఎంసీ 17వ మేయర్ గా విజయలక్ష్మీ త్వరలో బాధ్యతలను చేపట్టనున్నారు. విజయలక్ష్మీ రెండు పర్యాయాలు బంజారాహిల్స్ డివిజన్ నుంచి కార్పోరేటర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విజయలక్ష్మీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. వారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటూ.. నగరా అభివృద్దికి నిర్విరామ కృషి చేస్తానన్నారు.
మేయర్ ఎన్నికకు ముందు జీహెచ్ఎంసీ నూతన కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం సందడిగా జరిగింది. తమకు అనుకూలమైన బాషలో ప్రమాణం చేసేందుకు ప్రిసైడింగ్ అధికారి శ్వేతా మహంతీ అనుమతి ఇవ్వడంతో తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగీష్ బాషల్లో కార్పోరేటర్లు ప్రమాణం చేశారు. ఇవాళ మొత్తంగా 149 మంది కార్పోరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన 56. బీజేపికి చెందిన 47, ఎంఐఎంకు చెందిన 44, కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు వున్నారు. బీజేపికి చెందిన ఒక కార్పోరేటర్ మరణించడంలో ఒక కార్పోరేటర్ స్థానం ఖాళీగా వుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more