కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గత రెండు నెలలకు పైగా ఢిల్లీ శివారల్లో అన్నదాతలు నిరసనోద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ట్రాక్టర్ ర్యాలి తరువాత మళ్లీ ఇవాళ రైతులు దేశవ్యాప్తంగా జాతీయ, రాస్ట్రీయ రహదారుల బంద్ కు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు సాగిన ఈ రహదారుల రాస్తారోకో కార్యక్రమం దేశవ్యాప్తంగా విజయవంతం అయ్యింది.
అన్నదాతలు చేపట్టిన రాస్తారోకో కార్యక్రమంలో రెండు మూడు రాష్ట్రాలో కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా అంతగా ప్రశాంతంగా విజయవంతమైంది. పలు ప్రధాన నగరాల్లో రైతు ఉద్యమ మద్దతుదారులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన సాగిస్తున్న రైతులకు మద్దతుగా అనేక రాష్ట్రాల్లోని రైతు సంఘాల నేతలు, పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతూ ఈ రాస్తారోకో కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. పలు ప్రధాన నగరాల్లో రైతు ఉద్యమకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు.
పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో పలు చోట్ల రైతులు జాతీయ రహదారులను దిగ్బంధించారు. బెంగళూరు, పుణె, దిల్లీలో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బెంగళూరులోని యలహంక పోలీస్ స్టేషన్ బయట ఆందోళన చేస్తున్న రైతు మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని షాహీదీ పార్క్ వద్ద రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వదిలేశారు. మొత్తంగా రైతులు పిలుపుకు యావత్ దేశంలోని రైతులు కదిలారు.
ఇటు తెలుగు రాష్ట్రాలలో కూడా రైతు సంఘాల నేతలు, సీఫీఎం, సీపీఐ, కాంగ్రెస్, సహా పలు రాజకీయ పార్టీలు నిరసనలు తెలిపాయి. అటు అమరావతిలో రైతు సంఘాల నేతలతో పాటు వామపక్ష నేతలు, పలు రాజకీయ పార్టీల నేతలు కలసి నిరసన తెలిపారు. ఇటు తెలంగాణలో రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు నిరసన చేపట్టాయి. హయత్నగర్ వద్ద జాతీయ రహదారిపై కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తెజస శ్రేణులు ఎడ్ల బండ్ల ప్రదర్శనలో పాల్గొని సంఘీభవం ప్రకటించాయి. పీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు మల్రెడ్డి రాంరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో కార్యకర్తలు తరలివచ్చి రైతులకు మద్దుతు ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more