జనసేన పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ సంచలన విషయాలను వెల్లడించారు. ఆయన చేప్పిన విషయాలు జనసేన కార్యకర్తలకు మంచి ఊపును అందిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ తరుణం వస్తుందా అని వేచి చూసిన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు నూతనోత్తేజాన్ని కలిగించాయి. జనసేన పార్టీకి తన నైతిక మద్దుతును అందిస్తానని మెగాస్టార్ చిరంజీవి చెప్పారని ఆయన జనసేన కార్యకర్తల సమావేశంలో చెప్పడంతో హర్షాతీరేకలు వెల్లివిరిసాయి, ఆయన సలహాతోనే పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తున్నారని కూడా చెప్పారు.
నాదెండ్ల మనోహర్ విజయవాడలో జనసేన సమావేశంలో మాట్లాడుతూ, పవన్ తో కలిసి నడిచేందుకు తాను సిద్ధమేనన్న సానుకూల సంకేతాలను చిరంజీవి అందించారని తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు మరో నాలుగేళ్ల సమయం వుందని, వీటిలో మూడేళ్లు సినిమాలు చేసిన తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలు చేసుకోవాలని పవన్ కు చిరంజీవి సూచించారని వివరించారు పవన్ రాజకీయ ప్రస్థానంలో తాను కూడా అండగా నిలుస్తానని చిరంజీవి చెప్పారని నాదేండ్ల చెప్పారుం. దీంతో వేదిక కింద ఉన్నవారితో పాటు వేదికపై ఆసీనులైన వారి నుంచి కూడా కరతాళధ్వనులు, ఈలలు వెల్లివిరిసాయి,
జనసేన కార్యకర్ధలకు ప్రమాద భీమాను అందించే ప్రక్రియను ప్రారంభిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పునరాగమనం చేస్తున్నారా.? అన్న వార్తలు జోరందుకున్నాయి, ప్రజారాజ్యం స్థాపించి ఎన్నికలకు వెళ్లిన వెళ్లిన 2009లో ఆయన పార్టీ ఆశించిన మేర స్థానాలను కైవసం చేసుకోలేదు. దీంతో ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత రాష్ట్ర విభజన పర్యావసనాలతో ఆయన రాజకీయాలకు దూరంగా వుండిపోయారు. ఇక తాజాగా జనసేనుకు తాను మద్దతునిస్తారన్న నాదేండ్ల వ్యాఖ్యలతో మెగా ఫ్యాన్స్ లో జోష్ నెలకోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more