జనసేన పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ సంచలన విషయాలను వెల్లడించారు. ఆయన చేప్పిన విషయాలు జనసేన కార్యకర్తలకు మంచి ఊపును అందిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ తరుణం వస్తుందా అని వేచి చూసిన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు నూతనోత్తేజాన్ని కలిగించాయి. జనసేన పార్టీకి తన నైతిక మద్దుతును అందిస్తానని మెగాస్టార్ చిరంజీవి చెప్పారని ఆయన జనసేన కార్యకర్తల సమావేశంలో చెప్పడంతో హర్షాతీరేకలు వెల్లివిరిసాయి, ఆయన సలహాతోనే పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తున్నారని కూడా చెప్పారు.
నాదెండ్ల మనోహర్ విజయవాడలో జనసేన సమావేశంలో మాట్లాడుతూ, పవన్ తో కలిసి నడిచేందుకు తాను సిద్ధమేనన్న సానుకూల సంకేతాలను చిరంజీవి అందించారని తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు మరో నాలుగేళ్ల సమయం వుందని, వీటిలో మూడేళ్లు సినిమాలు చేసిన తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలు చేసుకోవాలని పవన్ కు చిరంజీవి సూచించారని వివరించారు పవన్ రాజకీయ ప్రస్థానంలో తాను కూడా అండగా నిలుస్తానని చిరంజీవి చెప్పారని నాదేండ్ల చెప్పారుం. దీంతో వేదిక కింద ఉన్నవారితో పాటు వేదికపై ఆసీనులైన వారి నుంచి కూడా కరతాళధ్వనులు, ఈలలు వెల్లివిరిసాయి,
జనసేన కార్యకర్ధలకు ప్రమాద భీమాను అందించే ప్రక్రియను ప్రారంభిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పునరాగమనం చేస్తున్నారా.? అన్న వార్తలు జోరందుకున్నాయి, ప్రజారాజ్యం స్థాపించి ఎన్నికలకు వెళ్లిన వెళ్లిన 2009లో ఆయన పార్టీ ఆశించిన మేర స్థానాలను కైవసం చేసుకోలేదు. దీంతో ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత రాష్ట్ర విభజన పర్యావసనాలతో ఆయన రాజకీయాలకు దూరంగా వుండిపోయారు. ఇక తాజాగా జనసేనుకు తాను మద్దతునిస్తారన్న నాదేండ్ల వ్యాఖ్యలతో మెగా ఫ్యాన్స్ లో జోష్ నెలకోంది.
(And get your daily news straight to your inbox)
Mar 06 | టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు... Read more
Mar 06 | ఉత్తమ సర్పంచ్గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more