(Image source from: Thehindu.com)
ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన తరువాత దానిని అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రభుత్వ పంచాయితీ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం.. రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు సింగిల్ జడ్జీ పంచాయితీ ఎన్నికలపై స్టే విధించిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటీషన్ దాఖలు చేశారు, ఈ పిటీషన్ పై విచారణను ఇవాళ రాష్ట్రోన్నత న్యాయస్థాన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.
ఈ కేసులో సుప్రీంకోర్టుకు చెందిన న్యాయవాది ఆదినారాయణ రావు, మాజీ అడ్వకేట్ జనరల్ డివి సీతారామమూర్తి రాష్ట్ర ఎన్నికల కమీషన్ తరపున నిన్న తమ వాదానలను వినిపించారు, కాగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ ఇవాళ తన వాదనలు వినిపించారు, రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటీషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వు చేసింది. అంతకుముందు ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఇంప్లీడ్ పిటీషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఇక నిన్న జరిగిన వాదనలకు ఇవాళ కూడా ప్రభుత్వం తరపున వాదనలు కోనసాగింపు జరిగిన అనంతరం న్యాయస్థాన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది,
కాగా, వారం రోజుల వ్యవధిలో పంచాయితీ ఎన్నికలపై తీర్పు వెలువడే అవకాశముందని హైకోర్టు సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. వాదనల గురించి చెబుతూ.... గతంలో ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పును అప్పీల్ చేసే అధికారం లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదించారని, ఇవాళ ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది అందుకు ప్రతివాదనలు వినిపించారని రాజేంద్రప్రసాద్ వివరించారు. ఈ కేసులో రిట్ అప్పీల్ చేసే వీలుందని ఎన్నికల సంఘం న్యాయవాది స్పష్టం చేశారు. సింగిల్ జడ్జీ ఇచ్చిన తీర్పు చట్టాన్ని అతిక్రమించేదిగా ఉందని, ఎన్నికలు జరపాలని చెప్పడం, జరిపించడం అనేది రాజ్యాంగ విధి అయినప్పుడు ఆ విధిని పాటిస్తున్న ఎన్నికల సంఘానికి అడ్డుతగలడం రాజ్యాంగ వ్యతిరేకం అని ఎస్ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారని రాజేంద్రప్రసాద్ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Mar 06 | టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు... Read more
Mar 06 | ఉత్తమ సర్పంచ్గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more