ఆర్యసమాజ్ నేత, జాతీయస్థాయి సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ పరమపదించారు. అనగారిన వర్గాల పక్షాన నిలిచిన గొంతు మూగబోయింది. బాధితవర్గాల పక్షాన పోరాటిన మహాశక్తి తరలివెళ్లిపోయింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఢిల్లీలోని అసుపత్రిలో చికిత్స పోందుతూ మరణించారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిల్లరీ సైన్సెస్ (ఐఎల్బీఎస్)లో చికిత్స పొందుతున్న అగ్నివేశ్ శరీరంలోని బహుళ అవయవాలు చికిత్సకు స్పందించకపోవడంతో మరణించారు. గత నాలుగు రోజులుగా ఆయనను వెంటిలేటర్ పై ఉంచి చికిత్సను అందించినా ఫలించలేదు.
ఈ తరుణంలో నిన్న రాత్రి ఆయన గుండెపోటు రావడం.. అప్పటికే పలు అవయవాలు చికిత్సకు సహకరించకపోవడంతో పేదల పక్షాన నిలిచిన ధైర్యం అనంతవాయువులలో ఐక్యమైంది. ఆయనను బతికించేందకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. అందరినీ విషాదానికి గురిచేస్తూ స్వామి అగ్నివేశ్ తుదిశ్వాస విడిచారు. గిరిజనులు, అదివాసీల పక్షాన నిలిచి వారికి అగ్నివేశ్ అండగా నిలబడ్డారు. వీరితో పాటు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా బాలకార్మిక వ్యవస్థకు కూడా ఆయన వ్యతిరేకంగా గళం విప్పారు, అణగారినవర్గాల మహిళలకు అండగా నిలిచారు.
స్వామి అగ్నివేశ్ వయసు 80 సంవత్సరాలు. ఆయన 1939 సెప్టెంబరు 21న శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. ఆయన అసలు పేరు వేప శ్యాంరావు. ఆయన కోల్ కతాలో విద్యాభ్యాసం చేశారు. లా, కామర్స్ అంశాల్లో పట్టా అందుకున్నారు. ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించిన స్వామి అగ్నివేశ్ 1977లో హర్యానాలో శాసనసభ్యుడిగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. నాడు ఉమ్మడి ఏపీలో మావోయిస్టులతో చర్చలు జరిపిన సమయంలో అగ్నివేశ్ ప్రముఖ పాత్ర పోషించారు. స్వామి అగ్నివేశ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ వేత్తలు తమ దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more