శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో చిక్కుకుపోయిన తొమ్మిది మంది సిబ్బంది ప్రాణలు కోల్పోయారు, శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో దట్టమైన పోగ అలుముకోవడంతో అటంకాల మధ్య కోనసాగిన సహాయక చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సింగరేణి కాలరీస్ కు చెందిన అత్యయిక బృందాలు పవర్ ప్లాంటులో చిక్కకుపోయిన తొమ్మిది మంది మృతదేహాలను వెలికి తీశారు, తొలుత ఒక్కరి మృతదేహమే లభించడంతో మిగతావారు సురక్షితంగానే వుంటారన్న ఆశలు అడియాశలయ్యాయి.
ఆ తరువాత మరో రెండు మృతదేహాలను వెలికి తీయగా మొత్తంగా మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను ఏఈ మోహన్ కుమార్, ఏఈ ఉజ్మ ఫాతిమా, ఏఈ సుందర్ లుగా గుర్తించారు. కాగా, కాసేపటికి మరో మూడు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి, వీరిని ఢీఈ శ్రీనివాస్, వెంకట్రావ్, రాంబాబులుగా గుర్తించారు. కాగా సంస్థలో చిక్కుకుపోయిన మరో జూనియర్ ప్లాంట్ అటెండర్ కిరణ్ తో పాటు అమ్రాన్ కంపెనీకి చెందిన వినేష్, మహేష్ ఇక మిగిలిన మృతదేహాల కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే వుంది, తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ కలెక్టర్ శర్మన్, ట్రాన్స్కో సీఈ రమేశ్ తదితరులు సహాయక చర్యలను దగ్గరుడి పర్యవేక్షిస్తున్నారు.
ఇక ఆ తరువాత మొత్తంగా ప్రమాదఘటనలో ప్లాంటులోనే చిక్కకుపోయిన వారి కోసం సహాయక చర్యలు సాగుతూనే వున్నాయి, కాగా దట్టమైన పొగ అలుముకున్న నేపథ్యంలోనూ సహాయక చర్యలు చేపట్టిన బృందాల్లోని సభ్యులు కూడా అస్వస్థతకు గురయ్యారు. ప్యానల్ బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి విస్పోటనం సంభవించింది. భారీ శబ్దాలు వినిపించడంతో భయాందోళనకు గురైన సిబ్బంది ఏంటా అని అరా తీసే లోపు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ పొగలు ఎక్కడి నుంచి వస్తుందో అని పరిశీలనకు వెళ్లిన తొమ్మది మంది సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు. కాగా, వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఉద్యోగుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more