Covid 19: 10376 fresh cases reported in AP ఏపీలో వరుసగా మూడవ రోజులో 10 వేల కేసులు.. 68 మరణాలు

Coronavirus in ap 10376 new covid 19 cases state tally crosses 1 4 lakh mark

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh crosses 1,40,933 Mark after 10376 new cases were reported in the last 24 hours, out of which 63,84 have so far recovered and have been discharged, while 1349 have died, the state health department said.

ఏపీపై కరోనా పంజా: వరుసగా మూడవ రోజు పది వేల కేసులు.. 68 మరణాలు

Posted: 07/31/2020 09:18 PM IST
Coronavirus in ap 10376 new covid 19 cases state tally crosses 1 4 lakh mark

(Image source from: Timesofindia.indiatimes.com)

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తూ ఏకంగా లక్ష కరోనా కేసులు దాటింది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు లక్ష మార్కు ను దాటి 40 వేలకు పైకి చేరాయి. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా పక్షం రోజులుగా ప్రతీ రోజు ఐదు వేల మార్కుకు పైగానే కరోనా పాజిటివ్ కేసుల నమోదు.. వరుసగా మూడో పర్యాయం అత్యధికంగ కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజులుగా పది వేలకు పైబడి కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా లక్ష నలభై వేల మార్కును అధిగమించింది, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇటీవల రోజరోజుకూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో పది వేల పైబడిన సంఖ్యలో కేసులు నమోదు కావడం ఆందోళన వ్యక్తమైంది.

తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా లక్షా ముఫై వేల మార్కును అధిగమించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 10376 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తంగా 1,40,933 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఎవరూ లేకపోవడం గమనార్హం. ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖ, అనంతపూర్, కర్నూలు, గుంటూరు ల్లోనే నమోదయ్యాయి. అత్యధికంగా ఏకంగా పద్నాలుగు వందల సంఖ్యలో ఒక్క అనంతపురం జిల్లాలోనే నమోదు కావడం అక్కడ తీవ్రతను తెలియజేస్తోంది.

ఇక రాష్ట్రంలో జిల్లాలవారీగా పరిశీలిస్తే.. ఆనంతపురంలో 1387, చిత్తూరు జిల్లాలో 789, తూర్పు గోదావరి జిల్లాలో 1215, గుంటూరు జిల్లాలో 906, కడప జిల్లాలో 646, కృష్ణా జిల్లాలో 313, కర్నూలు 1124. నెల్లూరు జిల్లాలో 861, ప్రకాశం జిల్లాలో 406 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, శ్రీకాకుళం జిల్లాలో 402, విశాఖపట్నం జిల్లాల్లో 983, విజయనగరంలో 388, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 956 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో జిల్లా వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు.

కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 68 మంది అసువులు బాసారు. గత 24 గంటల్లో అత్యధికంగా గుంటూరు, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక మరణాలు సంభవించాయి. గుంటూరు జిల్లాలో పదమూడు మంది, అనంతపురం జిల్లాలో తొమ్మిది మంది, కర్నూలు జిల్లాలో ఎనిమిది మంది, చిత్తూరు.. తూర్పు గోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున, ప్రకాశం జిల్లాలో ఆరుగురు, విశాఖపట్నం జిల్లాలో ఐదుగురు, నెల్లూరు.. శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, కడప.. కృష్ణా.. విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు. మొత్తంగా 1,349 మంది మరణించారు. కరోనాతో  ఇప్పటి వరకు 1,349 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 63,864కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం యాక్టివ్ గా వున్న కరోనా కేసులు 75,720కు చేరాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 434గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 2461కు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles