కొవిడ్-19 వైరస్ ఎంతటి ప్రమాదకారి వైరసో ఇప్పటికే ప్రపంచవ్యాప్త ప్రజలకు అవగతమైంది. దీంతో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు అనేక దేశాలు తమ పరిశోధనలకు పదను పెట్టాయి. ఈ క్రమంలో భారత్ సహా పలు దేశాల శాస్త్రవేత్తలు ప్రయత్నాలు విజయపథం వైపు సాగుతున్నాయి. కరోనాకు వాక్సీన్ తయారు చేసిన దేశాలు ప్రస్తుతం హ్యూమన్ ట్రయల్స్ కొనసాగిస్తున్నాయి. ఇవి ఎప్పుడెప్పుడు పూర్తి చేసుకుని మార్కెట్ లోకి వాక్సీన్ ను ఎప్పుడు ప్రవేశపెడతాయా.? అని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కారుచీకట్లను కమ్మడంతో అనేక అధ్యయనాలు సాగుతున్న నేపథ్యంలో ఆశలు చిగురించేలా చేస్తోంది ఓ అధ్యయనం. కారుచీకట్లను తరిమే చిరు దీపంలా.. శతాబ్దపు కాలం నాటి బీసీజీ వ్యాక్సీన్ పనిచేస్తోందని పేర్కోంది.
కరోనా వైరస్ మరణాలను అడ్డుకోవడంలో బీసీజీ వ్యాక్సిన్ కీలకంగా మారిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బీసీజీ వ్యాక్సిన్ కొనసాగుతున్న దేశాల్లో మరణాల శాతం తక్కువగా ఉందన్నారు. అమెరికాకు చెందిన అలర్జీ, సంక్రమణ రోగాల సంస్థ చేసిన ఓ అధ్యయనంలో ఈ ఆసక్తికర అంశాలు కనిపించాయి. అమెరికాలోని న్యూయార్క్, ఇల్లినాయిస్, లూసియానా, ఫ్లోరిడాతో పోలిస్తే బ్రెజిల్ లోని పెర్నాంబుకో, రియోడి జనీరో, సావో పాలో, మెక్సికోలోని మెక్సికో నగరంలో మరణాల రేటు చాలా తక్కువగా నమోదు కావడం శాస్త్రవేత్తల దృష్టిని సారించేందుకు కారణంగా మారింది. దీంతో అధ్యయనం ప్రారంభించిన శాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అమెరికా కన్నా అధికంగా జనబా సాంధ్రత కలిగిన లాటిన్ అమెరికా మరణాలు తక్కువగా నమోదు కావడంతో మరి అధ్యయనానికి మరింత బలం చేకూర్చింది.
ఇక అటు యూరోప్ లోని జర్మనీలోనూ ఫలితాలు ఆశ్చర్యజనకంగా ఉన్నాయి. తూర్పుప్రాంతం కన్నా జర్మనీలోని పశ్చిమంలో కరోనా మరణాల 2.9 శాతం ఎక్కువ. మరణాల రేటు తక్కువగా ఉన్న దేశాల్లో వయసు, ఆదాయం, ఆరోగ్య సదుపాయాల పరంగా తేడాలు ఉన్నప్పటికీ అన్నింటిలోనూ ఉన్న ఉమ్మడి కారకం టీబీ వ్యాక్సినేషన్. ప్రస్తుతం బీసీజీ వాక్సినేషన్ కొనసాగుతున్న ప్రాంతంల్లో మరణాల శాతం తక్కువగా నమోదయ్యిందని అధ్యయం చేసిన కరోలినా బరిల్లాస్ పేర్కోన్నారు. అందుకు జర్మనీ సాక్ష్యంగా నిలుస్తోంది. తూర్పు, పశ్చిమ జర్మనీలు 1990లో ఏకమయ్యాయి. పశ్చిమతో పోలిస్తే తూర్పు జర్మనీలో పదేళ్లు ముందుగానే టీబీ వ్యాక్సినేషన్ జరిగింది. దాంతో పశ్చిమ జర్మనీలో వృద్ధులకు కరోనాతో ఎక్కువ ముప్పు కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఏదైనా ఒక ప్రాంతంలో 10శాతం టీబీ వ్యాక్సినేషన్ కవరేజ్ ఉంటే కొవిడ్ మరణాల్లో అక్కడ 10శాతం తగ్గుదల కనిపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. మొత్తానికి బీసీజీ ఒక ఆశాజనకంగా కనిపిస్తోంది!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more