దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులోనూ రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారానికి పాల్పడిన నిందితులు పోలీసుల అదుపులో వుండగా, వారిని కాల్చేయాలని అన్న గొంతులే.. వారి ఎన్ కౌంటర్ తరువాత అయ్యో పాపం అంటూ వారి కుటుంబాలపై సానుభూతిని చూపుతున్నాయి. మానవత్వం నిండుకుండాలా బాసిల్తుతున్న తెలంగాణ రాష్ట్రం కాబట్టే.. కామాంధుల కుటుంబాలపై కూడా కరుణ చూపాలన్న వార్తలు వినిపించాయి. అయితే ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారి పట్ల కూడానా.? అన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.
అయితే.. వారు చేసిన ఘాతుకాన్ని ఒక్కసారి గుర్తచేసుకుంటే.. కామోన్మాదుల చేతికి చిక్కి.. దహణమైన పరిస్థితికి చేరుకునేంత వరకు ఆ వైద్యురాలి భాద వర్ణణాతీతం. చుట్టూ సముద్రమున్నా.. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు అన్నట్లుగా.. పక్కనే హైవే.. అందులోనూ టోల్ టాక్స్ ప్లాజాకు సమీపంలోనే తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని ఎవరైనా నిలువరిస్తారా.? అని ఎంతగా ఎదురుచూసిందో.. కనిపించని ఆ దేవుడిని కూడా ఎంతగా మొక్కుకుందో.. తనను చెరపట్టవద్దని కామోన్మాదులను ఎంతగా ప్రాధేయపడిందో.. అలోచిస్తే.. వారిని ఎన్ కౌంటర్ చేయడంలో తప్పేముందన్న వాదనలే ఎక్కువగా వినిపిస్తాయి.
అమె గొంతునోక్కి ఏడుపు బయటకు రాకుండా చేసినా.. అమె ఎంతగా విలపించిందో.. పైశాచిక మృగాళ్లవారిని ఎంతగా ప్రాధేయపడిందో.. అమె రోదనంతా అరణ్యరోదనగా మారి చివరకు అనంతలోకాలకు తరలివెళ్లిన తీరును గుర్తుచేసుకుంటే.. మానవమృగాళ్ల పట్ల కరుణ, జాలి, మానవత్వం అనేవి చూపించాలా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఇక ఈ దారుణానికి పాల్పడిన క్రమంలో దిశ గట్టిగా అరవకుండా అమెను అపస్మారక స్థితిలోకి పంపేందుకు మగమృగాళలు అమె నోట్లు బలవంతంగా తాము తెచ్చుకున్న మధ్యాన్ని పోశామని పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కోన్నారు.
తాజాగా అమె పోస్టుమార్టం నివేదికలోనూ అదే నిజమని స్పష్టమైంది. దిశ నోట్లో మద్యం పోసినట్లు నిందితులు నేర అంగీకార వాంగ్మూలంలోనూ ఈ విషయం వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు రిమాండ్ డైరీలో పోలీసులు పేర్కొన్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధరించారు. దీన్ని బట్టి నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం తాగించారనే విషయం ధ్రువపడుతోంది. మరోవైపు దిశ నిందితుల ఎన్కౌంటర్ మృతదేహాలు గాంధీ ఆస్పత్రి మార్చురీలోనే ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more