Disha forensic report reveals Alcohol traces ‘దిశ’ కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి..!

Alcohol traces found in disha s body forensic report

Disha, veterinary doctor, veterinary disha, disha case parents, disha parents encounter, disha case accused, cyberabad police, commissioner Sajjanar, mohammad arif, Siva, Navin, Chennakeshavulu, National Human Rights Commission, minors in disha case, minors encounter, NHRC, crimes against women, Telangana, Crime

After Disha gangrape and murder, doctors had conducted post-mertem of the body, Intially after the autopsy the doctors revealed that she was murder due to suffocation, but in the detail report there are few more issues which came into light.

‘దిశ’ కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి..!

Posted: 12/14/2019 01:34 PM IST
Alcohol traces found in disha s body forensic report

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులోనూ రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారానికి పాల్పడిన నిందితులు పోలీసుల అదుపులో వుండగా, వారిని కాల్చేయాలని అన్న గొంతులే.. వారి ఎన్ కౌంటర్ తరువాత అయ్యో పాపం అంటూ వారి కుటుంబాలపై సానుభూతిని చూపుతున్నాయి. మానవత్వం నిండుకుండాలా బాసిల్తుతున్న తెలంగాణ రాష్ట్రం కాబట్టే.. కామాంధుల కుటుంబాలపై కూడా కరుణ చూపాలన్న వార్తలు వినిపించాయి. అయితే ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారి పట్ల కూడానా.? అన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.

అయితే.. వారు చేసిన ఘాతుకాన్ని ఒక్కసారి గుర్తచేసుకుంటే.. కామోన్మాదుల చేతికి చిక్కి.. దహణమైన పరిస్థితికి చేరుకునేంత వరకు ఆ వైద్యురాలి భాద వర్ణణాతీతం. చుట్టూ సముద్రమున్నా.. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు అన్నట్లుగా.. పక్కనే హైవే.. అందులోనూ టోల్ టాక్స్ ప్లాజాకు సమీపంలోనే తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని ఎవరైనా నిలువరిస్తారా.? అని ఎంతగా ఎదురుచూసిందో.. కనిపించని ఆ దేవుడిని కూడా ఎంతగా మొక్కుకుందో.. తనను చెరపట్టవద్దని కామోన్మాదులను ఎంతగా ప్రాధేయపడిందో.. అలోచిస్తే.. వారిని ఎన్ కౌంటర్ చేయడంలో తప్పేముందన్న వాదనలే ఎక్కువగా వినిపిస్తాయి.

అమె గొంతునోక్కి ఏడుపు బయటకు రాకుండా చేసినా.. అమె ఎంతగా విలపించిందో.. పైశాచిక మృగాళ్లవారిని ఎంతగా ప్రాధేయపడిందో.. అమె రోదనంతా అరణ్యరోదనగా మారి చివరకు అనంతలోకాలకు తరలివెళ్లిన తీరును గుర్తుచేసుకుంటే.. మానవమృగాళ్ల పట్ల కరుణ, జాలి, మానవత్వం అనేవి చూపించాలా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఇక ఈ దారుణానికి పాల్పడిన క్రమంలో దిశ గట్టిగా అరవకుండా అమెను అపస్మారక స్థితిలోకి పంపేందుకు మగమృగాళలు అమె నోట్లు బలవంతంగా తాము తెచ్చుకున్న మధ్యాన్ని పోశామని పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కోన్నారు.

తాజాగా అమె పోస్టుమార్టం నివేదికలోనూ అదే నిజమని స్పష్టమైంది. దిశ నోట్లో మద్యం పోసినట్లు నిందితులు నేర అంగీకార వాంగ్మూలంలోనూ ఈ విషయం వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు రిమాండ్‌ డైరీలో పోలీసులు పేర్కొన్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఫోరెన్సిక్‌ నిపుణులు నిర్ధరించారు. దీన్ని బట్టి నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం తాగించారనే విషయం ధ్రువపడుతోంది. మరోవైపు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ మృతదేహాలు గాంధీ ఆస్పత్రి మార్చురీలోనే ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Disha  veterinary doctor  encounter  liquor  Liver  autopsy report  Shamshabad  Telangana  Crime  

Other Articles