మానవ సంబంధాలన్నీ మనీ చుట్టూ తిరిగే బంధాలే అన్న పెద్దలు.. డబ్బుకు వున్న శక్తిని గ్రహించగలిగారే కానీ.. ప్రకృతిలో సగమైన ఆడవారు.. వికృతుల చేతుల్లో చిక్కి శల్యమౌతుందని గుర్తించలేకపోయారా.? సంబంధాలను పాతరేసి.. పైశాచిక మృగాళ్లలా తెగబడుతున్నారా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో పాత గుంటూరు నగరంలో జరగిన ఘటనను పరిశీలిస్తే.. మారుతున్న మానవ సంబంధాలు.. మగమృగాళ్ల కామోన్మాదానికి తల్లి కూడా బలికావాల్సిందేనా.? అన్న సందేహాలు రేకెత్తకమానవు.
తల్లి తరువాత ఆంతటి గొప్పతనాన్ని అందిపుచ్చుకునే స్థానం వదినమ్మది. అలాంటి వదినమ్మనే కామోన్మాదులైన మరుదులు చెరబట్టి.. కామవాంఛను తీర్చుకుంటే.. అది చాలదన్నట్లు కొడలిని కూతరిలా చూసుకునే సంస్కారం లేని మామ కూడా కొడలిపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. తన వాంఛను కూడా తీర్చాలని వేధించాడు. అంతేకాదు ఈ విషయాలన్నీ తెలిసిన తరువాత తల్లిలా కోడలి పక్షాన నిలవాల్సిన అత్త కూడా తన కుమారుల పక్షాన చేరి హింసించింది. భర్తకు ఈ విషయాలను చెబితే ఆయన కూడా తన తమ్ముళ్లకు వంతపాడాడు.
దీంతో గత తొమ్మిదేళ్లుగా అమె నలుగురు కామాంధులున్న ఇంటి తన అవేధనను మౌనంగానే భరించింది. గొంతుదాటి వస్తున్న రోదనను పంటికింద బిగియపట్టుకుంది. ఈ క్రమంలో భర్త చిన్న సోదరుడు కూడా అమెకు పాలలో మత్తు మందు కలిపి ఇచ్చి ఆ తరువాత అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనకు ఎదురవుతున్న దారుణ వేధనను భరించలేక పోలీసులను ఆశ్రయించిన అమెపై దొంగతనం కేసు మోపి వేధించసాగారు. వారి వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు ఎట్టకేలకు ‘స్పందన’ కార్యక్రమంలో పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెంకు చెందిన బాధితురాలి కథనం ప్రకారం..‘2011లో పాత గుంటూరుకు చెందిన ఓ వ్యక్తితో నాకు వివాహమైంది. కుటుంబసభ్యుల కోరిక మేరకు మామకు రోజూ సాయంత్ర కాళ్లు పట్టేదాన్ని. ఆ సమయంలో కూతురిలాంటి నాపై ఆయన అసభ్యంగా ప్రవర్తించేవాడు. దాన్ని అలుసుగా తీసుకుని ఇద్దరు మరుదులు నన్ను బెదిరించి అనేకసార్లు అత్యాచారం చేశారు. మూడో మరిది పాలల్లో మత్తుమందు కలిపి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం భర్తకు చెబితే తమ ఇంట్లో అలాగే ఉంటుందని, ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలని అనడంతో పోలీస్స్టేషన్లో వేధింపుల కేసు పెట్టాను. దీంతో నాపై దొంగతనం మోపి అరెస్టు చేయించారని పేర్కోంది.
దీంతో ఈ కేసు నుంచి బయటకు వచ్చాక తనకు విడాకులివ్వాలంటూ భర్త బెదిరిస్తున్నారు. లేకపోతే చంపేస్తామంటున్నాడని చెప్పింది. సోమవారం గుంటూరు అర్బన్ పోలీసులు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో బాధితురాలు తమ ఆవేదనను పోలీసులకు వివరించింది. కామ పిశాచాల్లా తనపై మామ, మరుదులు లైంగిక దాడికి పాల్పడుతున్నా రక్షించాల్సిన భర్తే వాళ్లకు సహకరించాలని వంత పాడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. వారిపై తగిన చర్యలు తీసుకుని తనకే న్యాయం చేయాలని వేడుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more