టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదైంది. సీకే రామకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదుపై చర్యలు తీసుకున్న పోలీసులు మాజీ పార్లమెంటు సభ్యుడిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయనపై మహిళను బెదిరించిన కేసు నమోదైంది. కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే సతీమణితో ఆయనకున్న అక్రమ సంబంధాన్ని నిగ్గదీసి అడిగిన క్రమంలో తనను చంపుతానని, బెదిరిస్తున్నాడని, ఓ మహిళ పోలీసులను అశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నామా సహా ఆయన సోదరుడు సీతయ్యపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు ఐపీసీ సెక్షన్లు 506, 509 కింద గత ఏడాది అక్టోబర్ 28న కేసు నమోదు చేశారు.
ఓ వైపు ఈ కేసు విచారణ సాగుతున్న క్రమంలోనే రామకృష్ణ అనే వ్యక్తి పిర్యాదుతో నామా సోదరులపై మరో కేసు నమోదైంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని, విడాకులిచ్చి తనతో ఉండాల్సిందిగా నామా నాగేశ్వరరావు తన భార్యను వేధిస్తున్నారంటూ రామకృష్ణన్ అనే వ్యక్తి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45కు చెందిన సీకే రామకృష్ణన్ అమెరికాలో ఉంటుండగా, అతని భార్య సుజాత రామకృష్ణన్ జూబ్లీహిల్స్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో సుజాత ఇంటికి నామా తరచూ వచ్చి వెళ్లేవారు.
తాను అమెరికాలో ఉండగా ఓ రోజు భార్య సుజాత ఫోన్ చేసి నామా, ఆయన సోదరుడు నామా సీతయ్య బెదిరిస్తున్నారని చెప్పిందని రామకృష్ణన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ధైర్యం చెప్పడంతో అప్పుడే నామాపై సుజాత జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు వివరించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన తనకు భయంకరమైన విషయం తెలిసిందని, నామాతో తనకు వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని సుజాత చెప్పిందని రామకృష్ణన్ పేర్కొన్నారు. భర్తకు విడాకులిచ్చి తనతోనే ఉండాల్సిందిగా నామా ఇటీవల ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సుజాత తనతో చెప్పి కన్నీరు పెట్టుకుందని రామకృష్ణన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. నామా సోదరుడు సీతయ్య కూడా బెదిరిస్తున్నట్టు ఆరోపించారు. రామకృష్ణన్ ఫిర్యాదుతో నాగేశ్వరరావు, సీతయ్యపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more