అవినీతిపై పోరాటంలో దేనికి వెనుకాడనని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఛాతీ ఏకానమీ సర్జికల్ స్ట్రైక్ తరువాత కుండిపోయిందా..? అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దుతో తనను చంపాలని చూస్తున్నారని మోదీ అంటున్నారు... ఎన్నికల సందర్భంగా చూపిన తన 56 అంగుళాల ఛాతీ ధైర్యం ఏమైందని ఆయన నిలదీశారు. ప్రధానిని చంపేవారు దేశంలో ఎవరున్నారు? అని ఆయన ప్రశ్నించారు. టీవీ ముందుకు వస్తే చాలు, నోటికేది వస్తే అది మాట్లాడుతున్నారని రాజ్యసభలో ఆయన మండిపడ్డారు.
ప్రతిసారి ప్రధాని త్యాగం చేశాను, త్యాగం చేశాను అంటున్నారు. అన్నీ త్యాగం చేసిన వ్యక్తి ఎవరి డబ్బులతో విదేశీ పర్యటనలు చేస్తున్నారని నిలదీశారు. త్యాగాల సూక్తులు ప్రజలకు చెప్పి.. వారి ధనంతో సౌకర్యాలు పొందుడం నిజం కాదా..? అని అడిగారు. గంగానదిలో కొట్టుకొస్తున్న వెయ్యి రూపాయల నోట్లన్నీ నల్ల కుబేరులవేనంటున్నారు... అవన్నీ సాధువులవేనని ఎందుకు గుర్తించడం లేదు?' అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని ఏకపక్షంగా కొంత మందికి మాత్రమే తెలిసేలా తీసుకున్న నిర్ణయంతో తండ్రులు కుమార్తెలకు వివాహం చేసుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వివాహాలు రద్దు చేసుకుంటున్నారని, ఆసుపత్రుల్లో శవాలు కూడా బయటకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నల్లధనం నియంత్రణకు అంతా తామే చేసినట్టు గొప్పలు చెప్పుకోవద్దని ఆయన బీజేపీ నేతలకు సూచించారు. నల్లధనం నియంత్రణకు గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ ఎన్నో చర్యలు తీసుకున్నాయని అన్నారు. అందులో భాగంగానే తాము మనీ ల్యాండరింగ్ యాక్ట్, ఫెరా నిబంధనలు ఇలా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని ఆయన చెప్పారు. వాటి ఆధారంగానే ఇప్పటికీ నల్లధనాన్ని నియంత్రిస్తున్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో నల్లధనం అంతమైపోతే... 2000 రూపాయల నోటు ఎందుకని ఆయన నిలదీశారు. 2000 నోటు ప్రవేశపెట్టడం ద్వారా నల్లధనంపై కేంద్రం వ్యూహం ప్రజలకు అర్థమవుతుందని, దీనికితో మరింత అవినీతికి తెరలేస్తుందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో చిత్రమైన పరిస్థితి నెలకొందని ఆనంద్ శర్మ అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా వారిని దేశ వ్యతిరేకులుగా మీరు చిత్రీకరిస్తున్నారు. మీ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపినా.. వారిపై కూడా అదే ముద్ర వేస్తున్నారని దుయ్యబట్టారు. దీంతో ప్రధాని మాత్రమే దేశంలో మాట్లాడుతున్నారని.. కనీసం విపక్షాల మాటలు వినేందుకు కూడా ప్రధాని సభకు రాలేదని ఆయన అన్నారు. ఆయన గదిలో కూర్చుని మాట్లాడితే మాత్రం అందరూ చూడాలి.. విపక్షాలు చెప్పే మాటలను మాత్రం నేను వినను అంటే.. పార్లమెంటుకు ఆయనిచ్చే విలువ అవగతం అవుతుందన్నారు.
అధికారంలో ఉన్నాం కనుక దేశం మాది, మాకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటాం అంటే మాత్రం చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దని ఆయన హెచ్చరించారు. నగదురహిత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడుంది? అని ఆయన ప్రధానిని నిలదీశారు. దేశాన్ని మొత్తం దోచేశారంటున్నారు. మీకు గత ప్రభుత్వం ఖాళీ ఖజానా ఇచ్చిందా? అని ఆయన నిలదీశారు. గతంలో దేశాన్ని కేవలం రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ మాత్రమే పాలించారా? మొరార్జీదేశాయ్, చరణ్ సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్ పేయి వీళ్లంతా దేశాన్ని దోచేశారా? అని ఆయన నిలదీశారు. టీవీలో కనిపిస్తున్నామనగానే పూనకం వచ్చినట్టు ఊగిపోతారని, ఏం మాట్లాడుతారో కూడా అర్ధం కావడం లేదని ఆనంద్ శర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more