పవన్ ప్రత్యక్ష రాజకీయ ఆరంగ్రేటానికి తిరుపతి వేదిక కానుందా? ఇంతకాలం స్లీప్ మోడ్ లో ఉన్న జనసేన యాక్టివ్ కానుందా? త్వరలో పవన్ పూర్తిస్థాయి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నాడా? అంటే హఠాత్తుగా ప్రకటించిన సభ ఏర్పాట్లు సంకేతాలు అవుననే సంకేతాలను అందిస్తున్నాయి. గురువారం హత్యకు గురైన తన అభిమాని వినోద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తిరుపతి వెళ్లిన పవన్ కల్యాణ్ స్వామివారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అనంతరం అక్కడే గెస్ట్ హౌస్ లో ఆయన పలువురితో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇంతలోనే సభ గురించి వార్త వెలువడటం విశేషం.
శనివారం సాయంత్రం తిరుపతిలో జనసేన ప్రస్థానం పేరిట ఇందిరా మైదానంలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించగా, పవన్ కళ్యాణ్ కోటరీ అందుకోసం ఏర్పాట్లను ప్రారంభిస్తోంది. ఈ సభ వేదిక ద్వారా పవన్ ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, ప్రత్యేక హోదా, తదితర విషయాలపై స్పందించే అవకాశముందని తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో కొద్దికాలంగా క్రియాశీలత తగ్గించిన పవన్ మొన్న ప్రత్యేక హోదా పోరు సమయంలోనూ పెద్దగా స్పందించలేదు. దీంతో బహిరంగ సభ నిర్వహించి కార్యాచరణ ప్రకటించే ఉద్దేశంలో ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి.
గతంలో పవన్ సోదరుడు చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని తిరుపతిలోనే ప్రకటించి, అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో పవన్ కూడా అన్న బాటలోనే నడుస్తాడా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు టీడీపీతో మంచి సంబంధాలు ఉన్న పవన్ ఆ అవగాహనను కొనసాగిస్తారా లేదంటే విభేదిస్తారా? ప్రత్యేకంపై పోరులో విపక్షాల వెంట నడుస్తారా? ఒకవేళ ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ బీజేపీ తెగతెంపులు చేసుకుంటే, జనసేనతో కలిసి చంద్రబాబు కేంద్రంపై పొరు చేస్తారా? ఇలా ఎవరికి వారే భేరీజులు వేసుకుంటున్నారు. ఇక కొందరు కార్యకర్తలేమో వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగితే పవన్ స్వయంగా తిరుపతి నుంచి పోటీ చేస్తారని, అందుకే ఈ సభ అంటూ చెబుతున్నారు.
అయితే బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్న మైదానం వేదిక కేవలం ఏడెనిమిది వేల మంది పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ సభనా లేక కేవలం అభిమానులను ఉద్దేశించి మాట్లాడే సభనా అనే ఉత్కంఠ కూడా సాగుతోంది. ఏదేమైనా పవన్ సభ నిర్ణయం ఆకస్మికంగా వెలువటంతో రాజకీయ వర్గాలు ఇదంతా ఆసక్తిగా గమనిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more