కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు మన రాజకీయ నాయకులకు వాడుకోవటానికి ప్రతీ టాపిక్ ముఖ్యమే. టీవీల్లో ప్రసారమయ్యే యాడ్ ల దగ్గరి నుంచి యూనివర్సిటీ చావుల దాకా ప్రతీది వారికి ఆయుధమే. ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టేందుకు అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడానికి వారు సిద్ధంగా ఉండరు. తాజాగా బాలీవుడ్ చిత్రం ‘ఉడ్తా పంజాబ్’ ఇప్పుడు వారికి ఆయుధంగా మారింది. షాహిద్, అలియాభట్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలో డ్రగ్స్ మాఫియాతో తెరకెక్కిన ఈ చిత్రంలో పంజాబ్ సమకాలీన పరిస్థితులతోపాటు దానికి రాజకీయాల మద్ధతు ఎలా ఉండబోతుందనేది చూపించబోతున్నారట. తొలుత బ్యాన్ చేస్తారనే టాక్ వచ్చినప్పటికీ ఆపై సెన్సార్ క్లియరెన్స్ కోసం బోర్డు ముప్పుతిప్పలు పెట్టిందని తెలుస్తోంది.
చిత్రంలో పంజాబ్ ను చెడుగా చిత్రీకరించారని, బూతులు ఎక్కువగా వాడటం, డ్రగ్స్ వినియోగం అతిగా చూపించారని.. ఇంకా ఏవేవో కారణాలు చెప్పి సెన్సార్ వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే లేవనెత్తేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ‘ఉడ్తా పంజాబ్’ టీంకు మద్దతుగా కాంగ్రెస్ తోపాటు ఆమ్ ఆద్మీ కదిలింది. అయితే సినిమా పేరుతో రాజకీయాలు చేస్కుంటున్న వారికి పెద్ద షాకే ఇచ్చాడు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు.
‘ఉడ్తా పంజాబ్’ నిర్మాతల్లో ఒకరైన దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ విషయమై ట్విట్టర్లో స్పందించాడు. ఈ వివాదంలో తమకు ఎవరి మద్దతూ అవసరం లేదని.. సోషల్ మీడియాలో ఓ పార్టీ పెయిడ్ ట్వీట్లతో ఈ కాంట్రవర్శీని మరింత పెద్దది చేయాలని ప్రయత్నిస్తోందని.. తనను యాంటీ ఎన్డీఏ ఏజెంట్ గానూ చిత్రీకరించే ప్రయత్నమూ జరుగుతోందని అతనన్నాడు. అంతేకాక తాను ఎన్డీయే ప్రభుత్వంలో కంటే యూపీఏలో సెన్సార్ సమస్యలు మరింత ఎక్కువగా ఎదుర్కొన్నానంటూ కాంగ్రెస్ వాళ్ల గాలి తీసేశాడు . కాకపోతే ఇప్పుడు సెన్సార్ బోర్డును ఓ నియంత నడిపిస్తున్నాడంటూ ప్రహ్లాద్ నిహలానిని ఉద్దేశించి సెటైర్లు వేశాడు. ఈ విషయంలో తాను ఒంటరిగా పోరాడతానని కశ్యప్ స్పష్టం చేశాడు. మోదీని ఇరుకున పెట్టడానికి దీన్నో అవకాశంగా ఉపయోగించుకుని ఇష్యూను మరింత పెద్దది చేయాలనుకున్న ప్రయత్నాలకు భారీగానే గండపడినట్లయ్యింది.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more