దేశంలో ఏ మహ్మదీయ సోదరుడిని కదిలించినా.. వారు మాట్లాడినా, మాట్లాడకపోయినా.. మీడియా అడిగే తొలి ప్రశ్న మాత్రం అసహనం. ఇక సెలబ్రిటీలే ఏ కార్యక్రమంలో బయట కనబడినా వారిని ముందు వాలిపోతున్న మీడియా ఇదే ప్రశ్నను గుచ్చి గుచ్చి అడుగుతుంది. అయితే ఇదే అనుభవం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు కూడా ఎదురయ్యింది. అంతే దీనిపై స్పందించిన ఆయన తాను లౌకిక వాదినని రుజువు చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నాడు.
దేశంలో అసహనంపై తాను చేసిన వ్యాఖ్యలు.. వివాదాస్పదమైన నేపథ్యంలో షారుఖ్ ఈ విధంగా స్పందించారు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'అసహనం' చర్చ గురించి ప్రశ్నించగా 'దీని గురించి నిజంగా తనకేమీ తెలియదన్నారు. తాను ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా చెప్తానన్నారు. మంచి విషయాలు మాట్లాడుతానని.. అంతేకాకుండా తాను సెక్యులర్ అని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తానని ఆయన బదులిచ్చారు. దేశప్రజలందరూ ఐక్యంగా ప్రగతిని కోరుకోవాలని వారి మద్య లింగ, వర్ణ, ప్రాంత, కుల, మతాలన్న అంశఆలు అడ్డుగోడలు కాకూడదన్నారు. అలాంటి వాటిని తమ మనస్సులోకి కూడా రానీయకూడదన్నారు.
అందుకనే తాను సినిమాలు, నటన గురించి మాత్రమే మాట్లాడాలని నిశ్చయించుకున్నట్టు తెలిపాడు. తనకంటే ఎక్కువ దేశభక్తుడిని నేనే అని ఎవరైనా చెబితే.. అతను మూర్ఖుడని అన్నారు. దేశభక్తిలో ఎక్కువ, తక్కువ అనే హేతుబద్దలు వుండవన్నారు. అందరూ దేశభక్తులేనని చెప్పాడు. తాను గతంలో దేశంలోని పరిస్థితులపై తన అభిప్రాయాలు వెల్లడిస్తే వాటిని తప్పుగా అర్థం చేసుకుని, అన్వయించుకున్నారని షారుఖ్ చెప్పారు. పనిలో పనిగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై షారుఖ్ ప్రశంసల జల్లు కురిపించి..ఆయన పాలన అద్భుతంగా ఉందని కొనియాడారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more