నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతూనే వున్నాయే తప్ప ఏమాత్రం ఆగడం లేదు. అటు ప్రభుత్వం రైతులకు తామున్నామంటూ భరోసా కల్పిస్తున్నారే కానీ.. ఆత్మహత్యల్ని మాత్రం అదుపు చేయలేకపోతున్నారు. ప్రతిరోజూ పలువురు రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా మరో ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడంతో తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది.
రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రాఘవాపూర్ లో శ్రీశైలం అనే రైతు వున్నాడు. గతకొన్నాళ్ల నుంచి పంట సమస్యలు ఎదుర్కొంటున్న ఈయన.. ప్రభుత్వ సహాయం కోసం వేచి చూశాడు. మరోవైపు అప్పులు ఎక్కువగా పెరిగిపోయాయి. తన కష్టాలకు ఏదో ఒకరోజు పరిష్కార మార్గం దొరుకుతుందని వేచి చూశాడు కానీ.. ఫలితం లేకపోయింది. దీంతో చేసేదమీలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనిలాగే వరంగల్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలోని కిష్టాపురం తండాలో వుంటున్న పత్తిరైతు మోహన్.. అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక పరకాల మండలం, రామకృష్ణాపురంలో రాజేందర్ అనే రైతు కూడా అప్పుల బాధతో ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ విధంగా రైతుల ఆత్మహత్యలు తెరమీదకి రావడంతో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తమది రైతుల ప్రభుత్వం అని డప్పు వాయించుకుంటున్న కేసీఆర్ సర్కార్.. రైతులు బలవన్మరణానికి ఎందుకు పాల్పడుతున్నారో వివరణ ఇవ్వాలని కొందరు నిలదీస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. డబ్బున్న వాళ్లకే కేసీఆర్ సర్కార్ మరింత డబ్బు అందిస్తోందని.. రైతన్నలకు మాత్రం మొండిచెయ్యి చూపుతోందని అంటున్నారు. మరి.. తాజాగా వెలుగులోకొచ్చిన రైతున్న ఆత్మహత్యలపై కేసీఆర్ సర్కార్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more