నాగార్జున వర్సిటీలో బ్యాచిలర్ ఆప్ ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్నవిద్యార్థిని రుషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని నిజామాబాద్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిజానిజాలు వెలుగుచూడాలంటే.. సిబిఐ దర్యాప్తు ఒక్కటే మార్గమని అమె వ్యాఖ్యానించారు. లిబియాలో చిక్కుకున్న అధ్యాపకుడిని విడిపించేందుకు విదేశాంగశాఖతో మాట్లాడుతున్నామని త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని కవిత తెలిపారు. హైకోర్టును విభజించాలంటూ పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు మౌన ప్రదర్శన నిర్వహించారు. హైకోర్టును విభజించే వరకు ఆందోళన చేస్తామని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత ప్రదర్శన అనంతరం మీడియాతో మాట్టాడారు. చంద్రబాబు దురుద్దేశంతోనే స్పందించడం లేదని విమర్శించారు. ఆంధ్రా ప్రాంత విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ సబబేనని వారికి జీతాలు చెల్లించే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.
ఇదిలావుండగా, రిషితేశ్వరి మృతికి కారకులైన దోషులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని, సిట్టింగ్ జడ్జితో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విచారణ జరిపించాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించి బాధ్యులైన వారిని తక్షణం అరెస్టు చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయం జరగని పక్షంలో విద్యార్థుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి చెందిన రిషితేశ్వరి మృతిపై న్యాయ విచారణ జరిపించాలన్న డిమాండ్తో పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ల నేతృత్వంలో విద్యార్థులు శుక్రవారం రాష్ట్ర కేబినెట్ సమావేశాలు జరుగుతున్న విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు.
క్యాంపు కార్యాలయానికి వెళ్ళే ప్రధాన ద్వారాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినా వ్యూహాత్మకంగా ఒక్కొక్కరుగా విద్యార్థులు సివిల్ కోర్డుల దగ్గర సమీకరణ అయ్యారు. అక్కడి నుంచి ప్రదర్శనగా సీఎం క్యాంపు కార్యాలయం వైపుగా వచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయం ప్రధాన గేటు దగ్గర పోలీసులు సాధారణ భద్రతనే కల్పించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా లేరు. దీంతో విద్యార్థులు ఒక్క ఉదుటున బ్యారికేడ్లను చేధించుకుని లోపలికి ప్రవేశించే యత్నం చేశారు. ఈ దశలో లోపల ఉన్న పోలీసులు పరిగెత్తుకువచ్చి బ్యారికేడ్లను చేధించకుండా అడ్డుకున్నారు.
దీనిపై ఆగ్రహించిన విద్యార్థులు బ్యారికేడ్ల వెలుపలే ధర్నా తలపెట్టారు. ప్రిన్సిపల్ బాబూరావును, ర్యాగింగ్కు పాల్పడిన సహ విద్యార్థులు, ఒత్తిడి తీసుకు వచ్చిన విద్యార్థినులను తక్షణం అరెస్టు చేయాలని పెద్ద పెట్టున నినందించారు. కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ముఖ్యమంత్రి స్పందించటం లేదని.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వంపై విద్యార్థులు విమర్శలకు దిగటంతో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేయబోయారు. విద్యార్థులను అరెస్టు చేయటం పోలీసులకు తలకు మించిన భారమైంది. ఎట్టకేలకు విద్యార్థులందరినీ పోలీసులు అరెస్టు చేసి వన్టౌన్ పోలీసు స్టేషన్కు తరలించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more