జనరల్ ఎలక్షన్స్ సమీపిస్తోన్న తరుణంలో తెలంగాణ విషయమై ఆ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర మంత్రి అజిత్సింగ్తో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీ మధుయాష్కీ నివాసంలో ఎంపీలు అజిత్సింగ్కు అల్పాహార విందు ఇచ్చారు. సమావేశానికి ఎంపీలు రాజయ్య, గుత్తా సుఖేందర్రెడ్డి, మందా జగన్నాథం, పాల్వాయి గోవర్దన్రెడ్డి, సీనియర్ నేత కే కేశవరావు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంలు హాజరయ్యారు. పలు అంశాలపై చర్చించారు.
మరో వైపు టీ కాంగీ నేతలు పదునైన వ్యాఖ్యలతో ఈ అంశాన్ని మరింత బర్నింగ్ చేస్తున్నారు. సీమాంధ్ర ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓ పిచ్చోడు అని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. లగడపాటి ఓ జోకర్ అని అధిష్టాన పెద్దలే చాలాసార్లు అన్నారని తెలిపారు. లగడపాటి మాటలను తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మవద్దని కోరారు. తెలంగాణపై కేసీఆర్తో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతుందని చెప్పారు.
త్వరలోనే తెలంగాణ రావడం ఖాయం అని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ స్పష్టం చేశారు. కొంతమంది సీమాంధ్ర అవినీతిపరులే తెలంగాణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాల మద్దతు కూడగట్టేందుకు మంత్రి అజిత్సింగ్తో చర్చించామని తెలిపారు.
అన్ని పార్టీలను కలుపుకుని తెలంగాణ సాధన కోసం పోరాడుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె. కేశవరావు తెలిపారు. ఇప్పటికే టీడీపీ ఎంపీలతో చర్చించామని చెప్పారు. తెలంగాణ పోరాటానికి, ఎంపీలకు కేంద్ర మంత్రి అజిత్సింగ్ చేయూతనిచ్చారని పేర్కొన్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more