ప్రతిఒక్కరి జీవితంలో బాధ్యతలు తప్పనిసరిగా వుంటాయి. వాటిని తీర్చుకోవడం లేదా తీర్చడం కోసం ఎటువంటి భ్రదతాలోచనలు లేకుండా విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తుంటారు. అటువంటి సమయాల్లో వారికి భవిష్యత్ లో అవసరమయ్యే ఒక ఆర్థిక రక్షణ గురించి ఒక్కసారి కూడా ఆలోచించరు. ఇదే మొదటిగా చేసే ఒక పెద్ద తప్పు.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు పదవీ విరమణ పొందిన తరువాత ప్రభుత్వమే వారి సాంఘిక భద్రతను చూసుకుంటుంది. ఇటువంటి ప్రణాళికలు మన దేశంలో ఇతర దేశాల్లోనే ఎక్కువగా వుంది. మన దేశంలో ఈ సదుపాయాన్ని కేవలం 12 శాతం మంది మాత్రమే అనుభవిస్తున్నారు.
అంటే ప్రైవేటురంగంలో వున్న ఉద్యోగస్తులతోపాటు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా తమ భవిష్యత్ కోసం ముందుగానే ప్రణాళికలు చేసుకోక తప్పదు. ప్రస్తుతకాలంలో ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా చాలా పెరిగిపోతోంది. బయట మార్కెట్లలలో కూడా ధరలు ఏకధాటిగా పెరిగిపోతున్నాయి. పైగా బాధ్యతలు కూడా ఎక్కువైపోతున్నాయి.
ఉజ్వల భవిష్యత్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
ముందుగా అవసరాలకు తగ్గట్టు డబ్బులను వెచ్చించడం ఎంతో ముఖ్యం. పిల్లల చదువులకు కావలసిన ఖర్చులు, ఇంట్లో ఖర్చులు ఇలా రకరకాల బాధ్యతలు వుంటాయి. అటువంటి సమయంలో వాటికి కావలసిన డబ్బును మాత్రమే కేటాయించుకోవాలి. సంపాదించే డబ్బులో ఎంతో కొంత ఆదాయాన్ని మదుపు చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి.
సంపాదించుకున్న కష్టార్జితంలో నుంచి మిగిలే ఎంతోకొంత మొత్తాన్ని మదుపు చేసుకోవడం చాలా మంచి పద్ధతి. అధికంగా డబ్బులు వెచ్చించి సామాన్లు ఖరీదు చేయడం, దూరప్రయాణాలను విహరించడం కోసం డబ్బులు వెచ్చించడం అంత మంచిది కాదు. ఇప్పుడు మదుపు చేసుకుంటే.. భవిష్యత్ లో వచ్చే కష్టాలను ఎదుర్కోవడంతోపాటు సుఖంగా జీవితాన్ని గడపవచ్చు.
ప్రస్తుతకాలంలో మదుపు చేసుకోవడానికి చాలారకాల పథకాలు వున్నాయి. బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు వంటి తరహా పథకాలు వున్నాయి. ఇవి దీర్ఘకాలికంగా సాగే పథకాలు. మీ లక్ష్యాలను, నష్టభయాన్ని బట్టి ఇందులోనుంచి ఏదో ఒక పథకాన్ని మీరు ఎంచుకోవచ్చు.
ఆరోగ్య బీమా : ఆరోగ్య బీమా చేయించుకోవడం చాలా తప్పనిసరి. పైగా ప్రస్తుతకాలంలో వైద్యఖర్చలు మరీ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ముందుగానే ఈ పాలసీలను తీసుకొని, కొనసాగిస్తే.. అనుకోని ఆరోగ్య సమస్యలు ఎదురయినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం వుండదు.
ఎండోమెంట్ పాలసీ : డబ్బులను పొదుపు చేయడానికి ఇది ఎంతో మంచి పథకం. ఇవి దీర్ఘకాలంపాటు సాగే పథకాలు. వీటిని క్రమం తప్పకుండా మీరు ప్రీమియం చెల్లిస్తే.. వ్యవధి తీరిపోయిన తరువాత మీరు డబ్బుతోపాటు బోనస్, ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఒకవేళ పాలసీదారుడికి ఏమైనా అయితే.. ఆ డబ్బును నామినీకి ఇచ్చేస్తారు.
సాధారణంగా ప్రతిఒక్కరు అధిక లాభాలను పొందడానికి ముందుగా పెట్టుబడులు పెట్టడానికి మక్కువ చూపిస్తారు. అయితే అందులో తొందరపాటు నిర్ణయాలు అంత మంచివి కావు. పెట్టుబడులు పెట్టేడానికి ముందుగానే అందులో వచ్చే నష్టాలను, లాభాలను లెక్కలేసుకోవాలి. ఒకవేళ నష్టం వస్తే.. దానిని భరించగలిగే ధైర్యాన్ని కలిగి వుండాలి. అదే విధంగా ఏదైన ఒక కంపెనీని, సంస్థను స్థాపించడానికి ముందు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అందులో వచ్చే లొసుగుల్ని ఎదిరించి.. భవిష్యత్ లో వచ్చే సమస్యలను ఎదుర్కోగలుగుతాము.
(And get your daily news straight to your inbox)
Jun 13 | బంగారం విలువ గురించి తెలియనివారు ఈ భూప్రపంచంలోనే ఎవ్వరూ వుండరు. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీస అవసరాలు లేకపోయినప్పటికీ... 10 గ్రాముల బంగారం మాత్రం ఖచ్చితంగా వుంటుంది. మన హిందూ పురాణ కథనాలలో కూడా... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డుల ఉపయోగం ఎక్కువగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డు వుందన్న నెపంతో ప్రతిఒక్కరు ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, అనవసరమైన ఖర్చులు చేసిపడేస్తున్నారు. అలాగే డిస్కౌంట్స్ సీజన్ వచ్చిందంటే చాలు... వారికి... Read more
Apr 22 | ‘‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’’ అనే ధోరణినే ప్రతిఒక్కరు నేటి సమాజంలో అలవరిస్తున్నారు. అంటే... సంపాదించుకున్న తమ మొత్తం కష్టార్జితాన్ని మదుపు చేసుకోకుండా అప్పటికప్పుడే ఖర్చు చేసి పడేస్తున్నారని అర్థం. ప్రస్తుతకాలంలో అందరికి ఆర్థిక ప్రణాళికల... Read more
Apr 02 | ప్రస్తుతకాలంలో చదువు పూర్తయిన వెంటనే యువతీయువకులు పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నిన్నమొన్నిటివరకు తమ తల్లిదండ్రులమీద ఆధారపడిన ఈ యువకులు ఒక్కసారిగా ఉద్యోగాలు సంపాదించుకోవడంతో ఆర్థికంగా స్వాతంత్ర్యాన్ని పొందుతున్నారు. అయితే వీరు చాలా విషయాలలో... Read more
Mar 22 | ప్రస్తుతకాలంలో యువతీయువకులు సంపాదిస్తున్న కష్టార్జితాన్ని అనవసరమైన ఖర్చులకు అంటగడుతున్నారు. తమ భవిష్యత్ కోసం ఉపయోగపడే ఆర్థిక ప్రణాళికలను, లక్ష్యాలను, పథకాలను నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. తమకు వచ్చే జీతంలో మిగిలిన డబ్బులను దాచుకోకుండా ఖర్చులు చేసిపడే్స్తున్నారు.... Read more