మార్కెట్లలోని విలువలను కాలాలను బట్టి మారుతున్నాయి. ఒకసారి ధరలు తగ్గిపోతే.. మరోసారి అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కువ డబ్బును ఆర్జించే వారికి ఇటువంటి విషయాలలో ఎటువంటి తేడాలు కనబడకపోవచ్చు. కాని మిడిల్ క్లాస్ కుటుంబాలవారి మీద ఇవి చాలా ప్రభావం చూపుతాయి.
అటువంటి సమయాలలో ఏ పథకాలను అమలు చేస్తే డబ్బును మదుపు చేసుకోవచ్చు.... పెట్టుబడులు ఏ విధంగా పెట్టుకోవాలి అన్న విషయాలపై అవగాహన వుండాల్సిన అవసరం వుంది. అందులో ఉపయోగించాల్సిన జాగ్రత్తలు కూడా మనం తెలుసుకుంటే... భవిష్యత్ లో వచ్చే కష్టకాలాలను సులభంగా అధిగమించవచ్చు.
పాటించాల్సిన మార్గాలు....
మీరు సంపాదించిన కష్టార్జితంలో మిగిలిన మొత్తాన్ని మదుపు చేయాలనుకున్నప్పుడు వాటిని ఒకే చోట చేయకుండా చూసుకోవాలి. సాధ్యమైనంతవరకు వివిథ పథకాలలో మదుపు చేయడానికి ప్రయత్నించండి. అందులో మనకు షేర్లు, మ్యూచువల్, ఫండ్లు, స్థిరాస్తి, బంగారం, బీమా, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా రకరకాల పథకాలలో మదుపు చేసుకోవడం చాలా మంచింది. ఇలా చేయడంవల్ల ఏదైనా ఒకదానిలో వచ్చే నష్టాన్ని మనం ఇంకొక దానిలో వచ్చే లాభంతో పూరించుకోవచ్చు. ఫలితంగా భవిష్యత్ లో వచ్చే కష్టాలను అధిగమించవచ్చు.
మీరు మదుపు చేసిన డబ్బుతో లాభాలు సాధించాలంటే... ముందుగా మీరు పెట్టే పెట్టుబడులకు ఒక నిర్ణీతమైన విధానం పాటించాలి. అప్పుడే మీరు ఫలితాలను పొందగలరు. అంటే... మీరు పెట్టే పెట్టుబడులకు ఒక నిర్ణీత కాలాన్ని ఏర్పరుచుకోవాలి. అందులో వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకోవాలి. ఆ తరువాతే మీరు ఒక లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.
మీరు ఏదైనా ఒక కంపెనీలో షేర్లు పెట్టాలనుకుంటే ముందుగా దానికి సంబంధించిన అన్ని విషయాలలో అవగాహన వుంటే చాలా మంచిది. అందులో వున్న లోపాలను, లొసుగులను తెలుసుకున్న తరువాత షేర్లు పెట్టుకోవాలి. లేకపోతే భవిష్యత్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీరు పెట్టిన పెట్టుబడులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడూ వాటిని సమీక్షించుకోవాలి. అలా లేని పిదప దానివల్ల పెద్ద లాభం చేకూరదు.
మీరు షేర్లలోగాని, ఫండ్లలో గాని పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు సాధ్యమైనంతవరకు మీ దగ్గరే మిలిగిన సొమ్ముతోనే చేయండి. అలా కుదరని వేళ దానిని వదిలివేయడం చాలా మంచింది. ఒకవేళ మీరు అప్పు చేసి షేర్లు చేయాలనుకుంటే... కొన్ని సందర్భాలలో దానికి తగిన వడ్డీ కూడా గిట్టుబాటు కాకపోవచ్చు. ఇలా చేయడం వల్ల తీవ్రనష్టం సంభవిస్తుంది.
పెట్టుబడి పెట్టుకునేటప్పుడు ఎప్పటికీ ఇతరుల మాటలను పట్టించుకోకూడదు. సాధ్యమైనంతవరకు మీకై మీరే ఆ సంస్థ గురించి మొత్తం విషయాలను తెలుసుకుని షేరులో మదుపు చేయడం చాలా శ్రేయస్కరం.
మీరు పెట్టిన పెట్టుబడులలో ఒకవేళ నష్టాలు సంభవిస్తే.. దానికి భావోద్వేగానికి గురికాకుండా వాటిని అధిగమించేలా నిర్ణయాలను తీసుకోవాలి. దురాశ, దు:ఖం, భయాలను మార్కెట్ విషయాలలో ఎప్పటికీ పెట్టుకోకూడదు. వాటిని జయించినప్పుడే మనం సంభవించిన నష్టాలను ఎదుర్కొని విజయం సాధించగలం.
ఇలా ఈ విధంగా ప్రతిఒక్క విషయంలో జాగ్రత్తలు వహిస్తూ.. పెట్టుబడులను కొనసాగిస్తే.. వచ్చే గడ్డుకాలంలో కూడా ఎటువంటి భయం లేకుండా సాఫీగా జీవితాన్ని గడిపేయొచ్చు.
(And get your daily news straight to your inbox)
Jun 13 | బంగారం విలువ గురించి తెలియనివారు ఈ భూప్రపంచంలోనే ఎవ్వరూ వుండరు. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీస అవసరాలు లేకపోయినప్పటికీ... 10 గ్రాముల బంగారం మాత్రం ఖచ్చితంగా వుంటుంది. మన హిందూ పురాణ కథనాలలో కూడా... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డుల ఉపయోగం ఎక్కువగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డు వుందన్న నెపంతో ప్రతిఒక్కరు ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, అనవసరమైన ఖర్చులు చేసిపడేస్తున్నారు. అలాగే డిస్కౌంట్స్ సీజన్ వచ్చిందంటే చాలు... వారికి... Read more
Apr 22 | ‘‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’’ అనే ధోరణినే ప్రతిఒక్కరు నేటి సమాజంలో అలవరిస్తున్నారు. అంటే... సంపాదించుకున్న తమ మొత్తం కష్టార్జితాన్ని మదుపు చేసుకోకుండా అప్పటికప్పుడే ఖర్చు చేసి పడేస్తున్నారని అర్థం. ప్రస్తుతకాలంలో అందరికి ఆర్థిక ప్రణాళికల... Read more
Apr 07 | ప్రతిఒక్కరి జీవితంలో బాధ్యతలు తప్పనిసరిగా వుంటాయి. వాటిని తీర్చుకోవడం లేదా తీర్చడం కోసం ఎటువంటి భ్రదతాలోచనలు లేకుండా విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తుంటారు. అటువంటి సమయాల్లో వారికి భవిష్యత్ లో అవసరమయ్యే ఒక ఆర్థిక... Read more
Apr 02 | ప్రస్తుతకాలంలో చదువు పూర్తయిన వెంటనే యువతీయువకులు పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నిన్నమొన్నిటివరకు తమ తల్లిదండ్రులమీద ఆధారపడిన ఈ యువకులు ఒక్కసారిగా ఉద్యోగాలు సంపాదించుకోవడంతో ఆర్థికంగా స్వాతంత్ర్యాన్ని పొందుతున్నారు. అయితే వీరు చాలా విషయాలలో... Read more