ప్రాచీనకాలం నుంచి మన హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మన దోషాలను, నష్టాలను, పాపాలను తొలగించుకోవడానికి... అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను పొందడానికి ఎన్నోరకాల నోములు, వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. ఆనాడు సాక్షాత్తూ దేవుళ్లు కూడా ఇటువంటి ఆచారాలను అవలంభించడం జరిగింది. అటువంటి నోములలో ‘‘వట సావిత్రి వ్రతం’’ కూడా ఒకటి. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి సకల సౌభాగ్యాలు లభించడంతోపాటు రకరకాల దోషాలు, పాపాలు, కష్టనష్టాల నుంచి విముక్తిని పొందుతారు.
పూర్వం సావిత్రి కూడా ఈ వటసావిత్రి వ్రతాన్ని ఆచరించి, తన భర్త అయిన సత్యవంతునుని మృత్యువు నుంచి కాపాడుకోగలిగింది. అటువంటి మహోన్నత శక్తిని కలిగిన ఈ వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమనాడు లేదా జ్యేష్ఠ బహుళ అమావాస్యనాడు ఎంతో భక్తశ్రద్ధలతో ఆచరించుకోవాలి. ఈ వ్రతం ఆచరణలో ఎటువంటి సమస్యలు కలిగించుకోకుండా అన్ని జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి. వ్రతం భగ్నమయితే ఎటువంటి ఫలితాలు దక్కవు. అలాగే ఏ ఒక్క పద్ధతిని ఈ వ్రతంలో సరిగ్గా అవలంభించకపోతే నష్టాలు వాటిల్లుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని నిర్వహించుకోవాలి. ఈ వటసావిత్రీ వ్రతాన్ని మన భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా నిర్వహించుకుంటారు.
వ్రత విధానం :
ఈ వ్రతాన్ని నిర్వహించుకునేవారు.. ముందురోజు రాత్రి నుంచే ఉపవాసం వుండాలి. ఏ ఒక్క తినుబండారాలనుగానీ, పళ్లను గానీ తీసుకోకూడదు. తెల్లవారుజామున నిద్రలేవగానే రోజువారి కార్యక్రమాలను ముగించుకుని, తలస్నానం చేసుకోవాలి. మనసులో దేవుడిని దారిపొడవునా స్మరించుకుంటూ, మర్రిచెట్టు దగ్గరకు చేరుకోవాలి. అక్కడికి చేరుకున్న తరువాత మర్రిచెట్టు వద్ద అలికి ముగ్గులు వేసి, సావిత్రి - సత్యవంతుల బొమ్మలను ప్రతిష్టించుకోవాలి. ఒకవేళ వారి చిత్రపటాలు కనుక లభించకపోతే.. పసుపుతో చేసిన బొమ్మలను ప్రతిష్టించుకోవాలి. ఇలా ఈ విధంగా చేసిన వారికి మనువైధవ్యాధి, సకల దోషాల నుంచి పరిహారార్థం లభిస్తుంది.
తరువాత ‘‘బ్రహ్మ సావిత్రీ ప్రీత్యర్థం.. సత్యవత్సావిత్రీ ప్రీత్యర్థంచ.. వట సావిత్రీ వ్రతం కరిష్యే’’ అనే శ్లోకాన్ని భక్తితో పఠించుకోవాలి. ఈ విధంగా మర్రిచెట్టును పూజించడం వల్ల త్రిమూర్తులను పూజించినంత ఫలితం దక్కుతుందని ప్రతిఒక్కరు ఎంతో ప్రగాఢంగా విశ్వసిస్తారు. పూజానంతరం నమో వైవస్వతాయ అనే మంత్రాన్ని పఠిస్తూ.. మర్రిచెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసుకోవాలి. అనంతరం నైవేద్యం సమర్పించి, బ్రాహ్మణులకు - ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. ఇలా చేసినవారికి వారి భర్త దీర్ఘాయుర్దాయాన్ని పొందుతాడు.
(And get your daily news straight to your inbox)
Jun 11 | ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమ: - విష్ణతే నమ: మధుసూదనాయ నమ: - త్రివిక్రమాయ నమ: -... Read more
May 07 | కథ : పూర్వం ఒకానొక సమయంలో ఒక మహారాణి తనకోసం, తన తనయుల కోసం, తన రాజ్యంలో వున్న వారందరి శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం మూల గౌరీ నోమును నోచుకుంటుంది. నోము కాలం అయిన... Read more
Apr 17 | కథ : పూర్వం ఒక రాజు కూతురు, బ్రాహ్మణ కూతురు వుండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని గడిపేవారు. వీరిద్దరి జీవితంలో ఏ ఒక్క లోటు వుండేది కాదు. అయితే ఒకరోజు వీరిద్దరూ... Read more
Apr 16 | కథ : పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి’’ అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు. ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు... Read more
Apr 15 | పురాణ కథ : పూర్వం ఒక బ్రాహ్మణ దంపతులు వుండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని సంతోషంగా గడిపేవారు. బ్రాహ్మణ ఇల్లాలికి నలుగురు తమ్ముళ్లు వుండేవారు. అయితే తమ్ముళ్ల పెళ్లి వచ్చేసరికి ఆ... Read more