ఉపోద్ఘాతము : అధ్యాత్మ రామాయణంలోని ఉత్తరకాండలో 5వ అధ్యాయంలోని 62 శ్లోకాలతో కూడిన ‘‘శ్రీ రామగీత’’ పౌరాణిక శైలిలో రచించిబడి వుంది. ప్రసిద్ధమైన ఈ రామగీత ‘‘శ్రుతిసార సంగ్రహం’’ అని కూడా తరుచుగా పిలవబడుతుంది.
అన్నగారైన శ్రీరాముడి మాటలకు ఎదురుచెప్పలేక, బాధాకరమైన తన విధిని నిర్వర్తించి తిరిగి వచ్చిన లక్ష్మణుడు... అసందిగ్ధమైన ఆలోచనలతో, చిన్నాభిన్నమైన మనస్సుతో, కృంగి కృశిస్తూ కాలాన్ని గడుపుతున్నాడు. అదేవిధంగా సందేహిస్తూనే ఒకరోజు రాముడి దగ్గరకు వెళ్లి నైతిక ధర్మాల గురించి ప్రశ్నించాడు. పరిపూర్ణ తత్త్వవేత్త అయిన శ్రీరాముడు తనదైన శైలిలో జవాబుగా ఇచ్చిన సందేశాన్నే ‘‘శ్రీరామగీత’’ అని పిలవబడుతోంది. ఈ ‘‘శ్రీరామగీత’’లో రామలక్ష్మణుల సంవాదాన్ని వేదవ్యాసులు పార్వతీ పరమేశ్వరుల మధ్య సంభాషణాల ద్వారా చిత్రించారు.
శ్రీ మహాదేవ ఉవాచ :
1. తతో జగన్మంగల మంగలాత్మనా
విధాయ రామాయణకీర్తి ముత్తమామ్ !
చచార పూర్వాచరితం రఘూత్తమో
రాజర్షివర్యైరభిసేవితం యధా !!
భావము : పార్వతి అడిగిన ప్రశ్నకు ప్రేరేపితుడైన పరమశివుడు శ్రీరాముడి గురించి అత్యంత ఉత్సాహంతో ఈ విధంగా చెబుతున్నాడు... ఆ తర్వాత (తత:) అంటే.. సీతని అడవుల్లో వదిలిన తర్వాత, రఘువంశోత్తముడు, రామాయణ కీర్తి పాత్రుడు, జగన్మంగళరూపుడు అయిన శ్రీరామచంద్రుడు.. రాజరికం, భోగైశ్వర్యాల మధ్య జీవిస్తూ, తన పూర్వీకుల వలె జపతపాదులని అత్యంత నిష్ఠితో అనుష్ఠిస్తూ రాజర్షివలె జీవిస్తున్నాడు. ‘‘రమే సర్వభూతేషు,స్థావరేషు చరేషుచ’’ అంటే చరాచరములన్నింటిలోనూ క్రీడించునది. అదే ఆత్మ అని, రామచంద్రుని పేరు ఈ ‘రమ’ లోంచి గ్రహించబడింది. మొదటి శ్లోకంలోనే రాముడు పరమాత్మ అని చెప్పినట్టయింది.
2. శ్లోకము : సౌమిత్రిణా పృష్ట ఉదార బుద్ధినా
రామ: కథా: ప్రాహ పురాతనీ: శుభా: !
రాజ్ఞ: ప్రమత్తస్య నృగస్య శాపతో
ద్విజస్య తిర్యక్త్వ మధాహ రాఘవ: !!
తన సంభాషణను కొనసాగిస్తూ మహాదేవుడు తన మనోనేత్రంతో రాజ ప్రసాదంలో జరుగుతున్న అని విషయాలను చూస్తున్నట్లుగా వర్ణిస్తున్నాడు. ‘‘జీవితంలో అనుసరించాల్సిన అతి ముఖ్యమైన విలువలని నొక్కి నొక్కి తెలిపినటువంటి పురాతనమైన కథలనూ.. ఏవిధంగా ఒక్కొక్కప్పుడు ఘోరంగా మనుషులు పతనాన్ని చవిచూశారో, ఏ విధంగా అయితే అన్యాయాన్నీ తప్పించుకోలేని, దానిని ఎదుర్కోలేని పరిస్థితులలో వారు పడిపోక తప్పదోనని రాముడు చెప్తున్నాడు. నృగరాజు ఏ తప్పు చేయకపోయినా కఠిన శిక్షను అనుభవిస్తాడు. ఒక ఊసరవెళ్లిగా జన్మిస్తాడు. రాముడు ఈ కథను నొక్కి చెప్పినట్లుగా కనిపిస్తుంది. నృగరాజుకీ, తనకీ వున్న సామీప్యంవల్ల నిర్దోషి అయిన శ్రీరాముడు ప్రస్తుతం అనుభవిస్తున్న బాధలాంటిదే నృగరాజుది కూడా.
3. కదాచిదేకాంతా ఉపస్థితం ప్రభుం
రామం రమాలాలిత పాదపంకజమ్ !
సౌమిత్రిరాసాదిత శుద్ధ భావన:
ప్రణమ్య భక్త్యా వినయాన్వితో బ్రవీత్ !!
ఎవని పాదములను లక్ష్మీదేవి నిరంతరమూ సేవిస్తుందో, అట్టి శ్రీరామచంద్రుడు ఒకరోజు రాజకార్యభారాలూ, తపోసాధనలూ లేకుండా శాంతంగా ఏకాంతలో ఉద్యనవనంలో కూర్చొని, సాయం సంధ్యా సమయంలో చెట్లమీద నివాసం ఏర్పచుకుంటున్న పక్షుల కిలాకిలారావాలు వింటూ వున్నప్పుడు అనుంగు సోదరుడైన సువిత్రానందనుడు (లక్ష్మణుడు) సమీపించి, వినయంతో ప్రణమిల్లి, భక్తితో ఇలా ప్రశ్నించాడు.
మామూలుగా ప్రయమయిన సోదరుని కలుసుకునే విధంగాకాక, ఒక శిష్యుడు గురువుని సమీపించినట్లుగా వినయంగా సమీపించాడు. లక్ష్మణుని అంతరంగం వాసనాబలం నుంచి శుద్ధికాబడింది. అలా నిశ్చలం కాబడిన మనస్సే ధ్యానం ద్వారా తాత్విక రహస్యాలనూ ఆధ్యాత్మిక లక్షణాలను గ్రహించగల శక్తిని పొందుతుంది. గురువుని ఏకాంతంలో ప్రశ్నించడం కూడా ఉత్తమ శిష్యుని లక్షణం.
4. శ్లోకము : త్వం శుద్ధబోధో-సి హి సర్వదేహినాం
ఆత్మాస్యధిశో-సి నిరాకృతి: స్వయమ్ !
ప్రతీయసే జ్ఞానదృశాం మహామతే
పాదాబ్జ భృంగాహిత సంగ సంగినామ్ !!
లక్ష్మణుడు రామునితో అంటున్నాడు... ‘‘నీ సహజ స్వరపంలో శుద్ధమైన ఆత్మ చైతన్యంగా నీవు నిరాకారుడవు, నీకు రూపమే లేదు. అయినప్పటికీ నిరంతరమూ నిన్ను భక్తితో సేవించే వారి మనస్సు శుద్ధమవుతుంది, కాబట్టి నీ స్వస్వరూపమయిన ఆత్మతత్త్వాన్ని అట్టివారు గ్రహించగలుగుతారు. జ్ఞాన స్వరూపాన్ని గుర్తించగలుగుతారు.’’ శ్రీరామునిలోని పరమాత్మ స్వరూపానన్ని లక్ష్మణుని భక్తిభరిత హృదయం గుర్తించగలిగింది. అలా గుర్తించటమేగాక, నీ వలననే అన్ని రకముల జ్ఞానమూ సంభవమవుతోంది అని స్వయంగా అంటున్నాడు.
5. శ్లోకము : అహం ప్రపన్నోస్మి పదాంబుజం ప్రభో
భవాపవర్గం తన యోగిభావితమ్ !
యధాంజసాజ్ఞాన మపారవారిధిం
సుఖం తరిష్యామి తధానుశాధి మామ్ !!
ఇంతకుముందటి శ్లోకంలో శిష్యుడు తన గురువును కేవలం వ్యక్తికంటే వున్నతమైన తత్త్వంగా ఒప్పుకున్నాడు. అతడు తన గురువులో అనంతమైన ఆత్మచైతన్యాన్ని గుర్తించగలిగేడు. ఈ విధంగా గురువును మహోన్నతంగా భావించే మన:స్థితి సాధకునకెంతగానో ఉపయోగపడుతుంది.
శిష్యుడయిన లక్ష్మణుడు ఈ విధంగా గురువయిన రాముని శరనొందిన తరువాత సహాయాన్నీ, జ్ఞానాన్నీ అర్థించాడు. అజ్ఞాన సాగరాన్ని సులభంగా, వేగంగా దాటగల ఉపాయాన్ని,మార్గాన్ని చూపించమని లక్ష్మణుడు ప్రత్యేకంగా అడుగుతున్నాడు.
మనకి మన సత్యస్వరూపం తెలియకపోవడం వల్ల, మనం పరిమిత బాధామయ నీరస జీవులమనే వ్యక్తిత్వ భావన జనిస్తోంది. ఈ విధంగా సత్యాన్ని తెలియని అగ్రహణమూ, ఫలితమయిన అన్యధా గ్రహణమూ కలిసి, వేదాంత పరిభాషలో అజ్ఞానం అనబడుతోంది.
6. శ్లోకము : శృత్వాథ సౌమిత్రవచోఖిలం తదా
ప్రాహ ప్రసన్నార్తిహర: ప్రసన్నధీ: !
విజ్ఞాన మజ్ఞాన తమ: ప్రశాన్తయే
శృతి ప్రపన్నం క్షితిపాలభూషణ: !!
ఒక విద్యార్థిలోని ఉత్సాహాన్ని, శ్రద్ధనూ,అర్హతనూ గుర్తించిన ఏ గురువుకైనా సరే, అతనికి బోధించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. రామునిలోని గురువు, లక్ష్మణునిలోని ఉత్తమ శిష్యత్వాన్ని గుర్తించి, అజ్ఞానాంధకార నిర్మూలనకు సూటి అయిన రాజబాట ఉత్తమమైన జ్ఞాన సంపాదనే అని చెపుతున్నాడు.
రాముడు బోధించిన ఈ జ్ఞానం ఉపనిసత్ సారం. ఇట్టి ఉపనిషత్ సారాన్ని గ్రహించగలిగిన జ్ఞానం మనలను ఉన్నత చైతన్య బూమిక అయిన విజ్ఞానానికి చేర్చగలుగుతుంది. మర్త్వత్వం అమృతత్వంలో లీనం కావడమే ఈ జ్ఞాదర్శనం. సత్య సాక్షాత్కారం.
7. శ్లోకము : అదౌ స్వవర్ణాశ్రమ వర్ణితా: క్రియా:
కృత్యాసమాపాదిత శుద్ధమానస: !
సమాష్య తత్ పూర్వముపాత్త సాధన:
సమాశ్రయేత్సద్ గురుమాత్మ లబ్ధయే !!
శ్రీరామచంద్రుడు ఇలా అన్నాడు.. ‘‘మనకు విధించిన వర్ణాశ్రయ ధర్మాలనీ ఆచరించి, శుద్ధమైన అంతరంగాన్ని సాధించి, అంతకుముందున్న కర్మలని వదలాలి. ఈ విధంగా అవసరమయిన అర్హతలను పొంది, శరణాగత భావంతో సద్గురుని ఆత్మజ్ఞానం పొందటానికి ఆశ్రయించాలి.
నిస్వార్థంతో కర్మలు ఆచరించడం వల్ల, మనలోని వాసనలు క్షయమయే అవకాశం వుంది. దీనివల్ల మనస్సు పరిశుద్ధి పొంది, ఏకాగ్రంగా తయారవుతుంది. అప్పుడే గురుసాంగత్యంలో వేదాంత విద్యని పరిపూర్ణంగా పొందగలము.
8. శ్లోకము : క్రియాశరీరోద్ భవహేతురాదృతా
ప్రియాప్రియా తౌ భవత: సురాగిణ: !
ధర్మేతరౌ తత్ర పున: శరీరకం
పున: క్రియా చక్రవదీర్యతే భవ: !!
ఇందులో గురువుగా రాముడు కర్మల స్వభావాన్ని నిశితంగా విమర్శిస్తున్నాడు. భౌతికంగా వ్యక్తమయ్యే ఈ శరీరానికి కర్మలే కారణంగా భావింపబడుతున్నాయి. కర్మల వల్ల అంతరంగ శాంతి ఎప్పటికీ పొందలేం. కర్మల వల్ల కర్మఫలాలను అనుభవించే క్షేత్రమనదగిన శరీరాన్నీ, మరొక జన్మనీ పొందడం మాత్రమే సాధ్యపడుతుంది.
ధర్మ కర్మలూ, అధర్మకర్మలూ మనలో మంచి, చెడు వాసనలని కలిగిస్తాయి. ఈ వాసనలను అనుభవించడానికి తిరిగి జన్మని పొందక తప్పదు. ఈ విధంగా కర్మల వల్ల మనం కర్మలను చేస్తూ, ఫలితాలను అనుభవిస్తూ, చక్రభ్రమణం లాగా అనంతంగా జన్మపరంపరను కొనసాగించవలసిందే తప్ప... మోక్షాన్ని ప్రసాదించవు.
9. శ్లోకము : అజ్ఞానమే వాస్య హి మూలకారణం
తద్ధానమేవాత్ర విధౌ విధీయతే !
విద్యైవ తన్నాశవిధౌ పటీయసీ
న కర్మ తజ్జం సవిరోధమీరితమ్ !!
ఈ సంసారానికి మూలకారణం అజ్ఞానము. అజ్ఞానాన్ని నిర్మూలించగలిగేది జ్ఞానం మాత్రమే. కర్మ ఎన్నటికీ కాదు. కర్మలన్నీ అజ్ఞాన జనితాలని చెప్పబడుతున్నాయి. కాబట్టి కార్మకూ అజ్ఞానానికి భేదం లేదు.
అజ్ఞానం వల్లే మనం పరిమితమైన జీవులని బాధపడుతూ ద్వంద్వమయ జగత్తు బంధం నుండి విడివడి అంతులేని ఆనందాన్ని పొందాలనే కోరికతో నిత్యమూ శ్రమిస్తున్నాము. కాని అజ్ఞాన జనితాలే కర్మలు కాబట్టి తన మూలకారణాన్ని తానే నిర్మూలింపజాలదు. రోగి లక్షణాలెన్నటికీ రోగాన్ని నిర్మూలించలేవు.
10. నాజ్ఞానహానిర్ న చ రాగసంక్షయో
భవేత్తత: కర్మ సదోషముద్ భవేత్ !
తత: పున: సంసృతిరష్య వారితా
తస్మాద్ బుధో జ్ఞాన విచారవాన్ భవేత్ !!
కర్మలెన్నటికీ అజ్ఞానాన్ని అంతం చేయలేవు. కర్మఫలాల వల్ల మమకారాలు కూడా తగ్గిపోతాయి. పైగా కర్మలనుండి బంధించే కొత్తకర్మలు పుట్టుకొస్తాయి. వాటి ఫలితంగా సంసారంలో చిక్కుకుపోవడం తప్పనిసరి అవుతుంది. కాబట్టి తెలివయిన సాధకులు జ్ఞాన స్వభావం గురించి విచారించాలి.
ఇక్కడ జ్ఞానం అంటే అజ్ఞాన జనితమయిన అహంకారం. నేను చేస్తున్నాననే కర్తృత్వ భావనను కర్మల నుండి తొలగించడం సాధ్యంకాదు. కర్తృత్వ, భావనా, భోక్తృత్వ భావనా కలిసి అహంకారం అనబడతాయి. అదే జీవభావం, వ్యక్తిత్వ భావన. ఈ శ్లోకం శ్రీరామగీతకు ఉపోద్ఘాతం లాంటిది.
11. నను క్రియా వేదముఖేన చోదితా
తథైవ విద్యా పురుషార్థ సాధనమ్ !
కర్తవ్యతా ప్రాణభృత: ప్రచోదితా
విద్యాసహాయత్వముపైతి సా పున: !!
పరమ పురుషార్థాన్ని సాధించడానికి జ్ఞానం ఒక మార్గమనీ.. అలాగే బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మాన్ని చేరుకుంటాడని వేదాలు స్పష్టంగా చెబుతున్నాయి.
శ్రీరాముడు చెప్పినదానిని ఇంకా బాగా బోధించడానికి ఇతరుల వాదాలను కూడా చెబుతున్నాడు. కర్మకాండను అనుసరించేవారు వేదాలు, జ్ఞానంతోబాటు కర్మమార్గం కూడా బోధించాయని అంటున్నారు.
12. కర్మాకృతా దోషమపి శృతిర్ జగౌ
తస్మాత్ సదా కార్యమిదం ముముక్షుణా !
నను స్వతంత్రా ధృవకార్య కారిణి
విద్యా న కించిన్మ నసాష్య పేక్షతే !!
కర్మలు ఆచరించకపోవడం పాపమని వేదాలు కూడా చెబుతున్నాయి. మోక్షాన్ని కోరేవారు ధ్యానాన్ని అభ్యసిస్తూనే వేదవిహిత కర్మలను విధిగా ఆచరించాలని అంటున్నారు. కర్మ అవసరం లేదని నువ్వు అనుకున్నట్లయితే.. స్వప్నంలో కూడా ఇది సంభవం కాదంటున్నారు.
ఈ మాటలు సముచ్ఛయ వాదులవి. కర్మలను మనం విధించినట్లుగా ఆచరింకపోయినా, చేయపోయినా పాపం వస్తుందంటున్నారు. కేవలం జ్ఞానమార్గం ఒక్కటే చాలని, కర్మ అక్కర్లేదని అనుకోవడం చాలా ప్రమాదకరమని అంటున్నారు.
13. న సత్యకార్యోపి హి యద్వదధ్వర:
ప్రకాంక్షతేన్యానపి కార కిదికాన్ !
తథైన విద్యా విధిత: ప్రకాశితై:
విశిష్యతే కర్మభిరేవ ముక్తయే !!
ఎన్నో యాగాలు, జపతప పూజాది క్రుతకర్మలూ వేదాలలో కర్మకాండ విభాగంలో వివరంగా ఇవ్వబడ్డాయి. వాటి పలితాలు కూడా గొప్పగా వర్ణించబడ్డాయి. అలాగే జ్ఞానమార్గం కూడా వేదాలలో నిర్దేశింపబడిన కర్మల సహాయం వల్ల మాత్రమే ముక్తినివ్వగలదని అంటున్నారు సముచ్ఛయవాదులు.
పైన చెప్పబడిన మూడు శ్లోకాలలో సముచ్ఛయవాదులు జ్ఞాన, కర్మలు ఒకదానికొకటి సహాయకారులుగా బలాన్నిచ్చినప్పుడే ముక్తి సాధ్యమవుతుందని అంటున్నారు. వీరి దృష్టిలో జ్ఞానమార్గం స్వతంత్రం కాదు. శ్రీరామచంద్రుడు గురువుగా తను బోధించేది మాత్రమే బోధించకోకుండా.. ఇటువంటి వాదం కూడా వుందని తెలియపరుస్తున్నారు.
14. కేచిద్వన్తీతి వితర్కవాదిన్
తదప్య సద్దృష్ట విరోధ కారణాత్ !
దేహాభిమానాదభి వర్తతే క్రియ
విద్యా గతాహంకృతిత: ప్రసిద్ధ్యతి !!
శ్రీరామచంద్రుడు సముచ్ఛయవాదులకు జవాబులిస్తూ... ఇది కుతర్కమే కానీ సరైన వాదం కాదు. ఎందుకంటే వాటిలో స్పష్టంగా వైరుద్ధ్యం కనబడుతుంది. కర్మ చేయడానికి నేను అనే అహంకారం లేదా కర్తృత్వ శభావన వుండాలి. జ్ఞాన దర్శనానికి, దేహ తాదాత్మ్యం నశించాలి.
ఇక్కడ వివరంగా చెప్పదలచుకున్నదేమిటంటే.. కర్మ, జ్ఞానమార్గాలు ఒకదానికొకటి సహాయకారులు అనుకోవడం పొరపాటు వాదనే. స్వప్న జగత్తులో అహంకారం ఎన్నటికీ జాగ్రదావస్థను చేరుకోలేదు. జాగ్రదావస్థలోని అహంకారం సుషుప్తి అవస్థలో అంతమైపోతుంది. స్వప్న జాగ్రత్ సుషుప్తి అహంకారం పూర్తిగా అదృశ్యమైతేనే ఆత్మ సాక్షాత్కారమవుతుంది. అదే స్వరూప స్థితి.
15. విశుద్ధ విజ్ఞాన విరోచనాం చితా
విద్యాత్మవృత్తిశ్చరమేతి భణ్యతే !
ఉదేతి కర్మాఖిల కారాకాదిభిర్
నిహంతి విద్యాఖిల కారకాదికామ్ !!
శ్రీరామచంద్రుడు ఇక్కడ విద్యం అనే పదం అర్థాన్ని వివరంగా నిర్వచిస్తున్నారు. శుద్ధమైన అంతరంగంలో ధ్యానంవల్ల ఏర్పడిన ఆత్మకు సంబంధించిన ఆలోచనే విద్య అనబడుతుంది. కర్మ కారణాలవల్ల (ఇంద్రియాల వల్ల) ఉదయిస్తుంది. విద్య ఆ కారణాలను, ఇంద్రియాలను నశింపచేస్తుంది.
కర్మ, జ్ఞానమార్గాలకు అవినాభావ సంబంధం వుందన్న వాదనని శ్రీరామచంద్రుడు ఒక్క వేటుతో సమూలంగా ఇక్కడ ఖండించారు. కర్మలో మనస్సు బాగా పనిచేస్తూ, పనిచేసే క్షేత్రంలోనికి బాహ్యాభిముఖంగా ప్రసరించాలి. ఇదే ధ్యానంలో అయితే, బాహ్యప్రపంచంనుంచి మనస్సుని అంతర్ముఖం చేసి, జీవాత్మ, పరమాత్మల అభేదత్వ విచారణతో ఏకాగ్రతగా నిలపాలి. ఆత్మాకార వృత్తిలో మనస్సుని లగ్నం చేయాలి.
16. తస్మాత్త్య జేత్కార్యమశేషత: సుధీర్
విద్యావిరోధాన్న సముచ్ఛయో భవేత్ !
ఆత్మానుసన్ధానపరాయణ: సదా
నివృత్త సర్వేంద్రియవృత్తి గోచర: !!
అంతరంగం శుద్ధి అయినవారు అన్ని కర్మలను త్యజించాలి. కర్మలు జ్ఞానానికి విరుద్ధమైనవి కాబట్టి ఒక్కసారి వీటిని ఆచరించడానికి వీలుకాదు. ఇంద్రియాలను కార్యకలాపాలనుంచి మరలించి, మనస్సుని శాంతింపచేసి, సాధకుడు ఎల్లవేళలా ఆత్మ మీదే దృష్టిని కేంద్రీకరించి ధ్యానించాలి.
17. యావచ్ఛరీరాదిషు మాయయాత్మధీ:
తావద్విధేయో విధివాదకర్మణామ్ !
నేతీతి వాక్యై రఖిలం నిషిద్ధ్య తత్
జ్ఞాత్వా పరాత్మనమథ త్యజేత్ర్కియా: !!
కర్మలను త్యజించడం అనే మాట సాధకునికి దిగ్ర్భాంతి కలిగించవచ్చు. అందుకే దీనిగురించి క్లుప్తంగా శ్రీరామచంద్రుడు ఈ శ్లోకంలో వివరిస్తూ... ఎంతకాలం ఈ శరీరమే నేను అనే భావనతో నమ్మకం కలిగి వుంటావో.. ఎంతకాలం మాయకు లోబడి దేహాత్మ భావాన్ని కలిగివుంటావో.. అంతకాలమూ వేదవిహితమైన పవిత్రనిస్వార్థ కర్మలను ఆచరిస్తూనే వుండాలి. ఆ తర్వాత నేతి ఇది కాదు అనే శృతివాక్యాల సహాయంతో శరీర తాదాత్య భావం నుండి బయట పడాలి. ఆత్మను దర్శించాలి. అప్పుడు అన్నీ కర్మలను విడిచిపెట్టాలి.
18. యదా పరాత్మాత్మ విభేద భేదకం
విజ్ఞాన మాత్మన్యవభాతి భాస్వరమ్ !
తధైన మాయా ప్రవిలీయతేంజసా
సకారకా కారణమాత్మ సంసృతే: !!
పరమాత్మ, నేను అనే అహంకారం భగవంతునిచే సృష్టంచబడిన నానాత్వమయిన ప్రపంచం ఈ మూడు కూడా ప్రత్యక్షంగా విజ్ఞానాన్ని దర్శించడం వల్ల అంతరించిపోతాయి. అప్పుడు అంతరంగంలో జ్యోతిస్వరూపమైన ఆత్మ ఉదయిస్తుంది. స్వయంగా స్ఫురిస్తుంది.
19. శ్రుతి ప్రమాణాభివినాశితా చ సా
కథం భవిష్యత్యపి కార్యకారిణీ !
విజ్ఞాన మాత్రాదమలాద్వితీయత:
తస్మాదవిద్యా న పునర్భవిష్యతి !!
ఒకసారి నశింపబడిన మాయ మళ్లీ తన ప్రభావాన్ని చూపిస్తుందేమోనన్న అనుమానం శిష్యునిలో కలగవచ్చు. అది ముందే ఊహించి గురువు ఈ విధంగా అంటున్నారు. ఆవరణ వుండడం వల్లే విక్షేపం సంభమవుతుంది. ఆవరణే తొలగిపోయిన తరువాత విక్షేపాలకు అవకాశం వుండదు. ప్రత్యక్షంగా సత్యాన్ని దర్శించడం వల్ల ఆవరణ నశించి, విక్షేపం తన మాయాజాలాన్ని ఉపసంహరించుకుని పూర్తిగా అదృశ్యమైపోతుంది.
20. యది స్మ నష్టాన పున: ప్రసూయతే
కర్తాహమస్యేతి మతి: కథం భవేత్ !
తస్మాత్ స్వతంత్రా న కిమస్యపేక్షతే
విద్యా విమోక్షాయ విభాతి కేవలా !!
శ్రీరామచంద్రుడు సముచ్ఛయవాదుల వాదంలోని లోపాలను ఎత్తిచూపుతూ... మాయను ఒకసారి నశింపచేస్తే దాని ఫలితాలయిన నిక్షేపాలన్నీ కూడా పూర్తిగా నశిస్తాయి. అటువంటి సమయాల్లో భ్రమను కలుగజేసే అహంకారం ఏ విధంగా నేను కర్తను అనే భావాన్ని కలగజేయగలదు? అందువల్ల కర్మ, జ్ఞానము రెండూ ఒకే సాధకుని చేత ఒకే సమయంలో అనుసరింపబడవు.
21. సా తైత్తిరీయ శ్రుతిరాహ సాదరం
న్యాసం ప్రశస్తాఖిల కర్మనా స్ఫుటమ్ !
ఏతావదిత్యాహ చ వాజినాం శ్రుతిర్
జ్ఞానం విమోక్షాయ న కర్మ సాధనమ్ !!
ప్రశస్తమైన తైత్తిరీయ ఉపనిషత్తులో శాస్త్ర విహిత కర్మలన్నిటినీ తప్పకుండా త్యజించాలని దృఢంగా చెప్పబడింది. బృహదారణ్య కోపనిషత్తులో కూడా ‘ఇది మాత్రమే అమృతత్వం’ లాంటి వాక్యాలవల్ల మోక్షం పొందడానికి జ్ఞానమే ప్రధానమని, కర్మలు కాదని చెప్పబడింది.
22. విద్యాసమత్వేన తు దర్శితస్త్వయా
క్రతుర్ న దృష్టాంత ఉదాహృత: సమ: !
ఫలై: పృథక్త్వాద్ బహుకారకై: క్రతు:
సంపాధ్యతే జ్ఞానమతో విపర్యయమ్ !!
13వ శ్లోకంలో సముచ్ఛయవాదులు యజ్ఞం చేయడానికి అనేక విధాల సహాయం ఎలా అవసరమో, జ్ఞానగమ్యాన్ని చేరుకోవడానికి కర్మల సహాయం అలా కావాలని ప్రతిపాదించారు. వీరి విధానానికి ఆధారమే లేదు. వారు దాన్ని రుజువు చేయలేరని శ్రీరామచంద్రుడు చూపిస్తున్నాడు. ఎందువల్లంటే.. ఈ రెండూ విభిన్నరకాల ఫలితాలనిస్తాయి. కర్మల వల్ల ఇంకా కొత్త కర్మలు పుడుతూ వుంటాయి. కర్మలు చెయ్యటానికి మళ్లీ మళ్లీ పుడుతూ వుండాలి. జ్ఞానం దానికి పూర్తిగా విరుద్ధమైంది. కర్మలు చేయాలంటే ఇతర అంశాలు తోడ్పడాలి. కాని జ్ఞానం స్వతంత్రమైంది. శరీర స్పృహ నుంచి కర్మలు జనిస్తాయి. శరీర స్పృహ నశించినప్పుడే జ్ఞానం సిద్ధిస్తుంది.
23. స ప్రత్యవాయో హ్యాహమిత్యనాత్మధీ:
అజ్ఞప్రసిద్ధా న తు తత్త్వదర్శిన: !
తస్మాద్ బుధైస్త్యాజ్యమవిక్రియాత్మభిర్
విధానత: కర్మ విధిప్రకాశితమ్ !!
12వ శ్లోకంలో సముచ్ఛయవాదులు కర్మలను ఆచరించకపోతే పాపమని వాధించారు. దానికి సరైన అర్థం శ్రీరామచంద్రుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. విక్షేపశక్తి ప్రభావానికి లోనయి తనను తాను మనశ్శరీరాలుగా పొరబడుతున్నవారికి మాత్రమే కర్మలను ఆచరించకపోతే పాపం వస్తుంది అన్న భావం వర్తిస్తుంది. సత్యాన్ని గ్రహించి మనశ్శరీరాలు తాను కావడే దృడ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో.. అప్పుడు ఇది ఎంతమాత్రం వర్తించదు. కాబట్టి నిత్యత్వాన్ని గుర్తించిన జ్ఞానులు వేద విహితమైన కర్మలను త్యజించాలి.
24. శ్రద్ధాన్వితస్తత్త్వమసీతి వాక్య
గురో: ప్రసాదాదపి శుద్ధ మానస: !
విజ్ఞాయ చైకాత్మ్యమధాత్మ జీవయో:
సుఖీ భవేన్మేరు రివాప్రకమ్పన: !!
దశలవారీగా శ్రీరామచంద్రుడు బోధిస్తూ.. నిష్కామకర్మలు చేయడంవల్ల అంతరంగం శుద్ధి చెందుతుంది. అలా శుద్ధిమయిన అంతరంగాన్ని సాధించిన సాధకుడు తాత్త్విక రహస్యాలని అర్థం చేసుకోగల సునిశిత మేధను పొందుతాడు. నిశ్చల మనస్సుతో పరమసత్యాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఆ తర్వాత తత్త్వమసివంటి మహాకావ్యాలు సూచించే బాటలో, అచంచల ధ్యానంలో లక్ష్యాన్ని చేరుకుని పరమానందంలో పరిస్థితులకి చలించకుండా మేరు నగధీరుడై వుంటాడు.
25. ఆదౌ పదార్థావగతిర్ హి కారణం
వాక్యార్థ విజ్ఞాన విధౌ విధానత: !
తత్త్వం పదార్థౌ పరమాత్మ జీవకా
వసీతి చైకాత్మ్యమధానయోర్ భవేత్ !!
తత్ అంటే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అయిన ఈశ్వరుడని అర్థం. త్వం అంటే బుద్ధిపరంగా, శక్తిపరంగా పరిమితమైన జీవుడని అర్థం. ఈ జీవునకు అజ్ఞానమే ఉపాధిగా పరిమితిగా వుంటుంది. శ్రుతుల భాషలో సత్యం తెలియని వ్యక్తిగత అజ్ఞానం అవిద్య అనబడుతుంది. అసి అనే పదం ఇవి రెండూ ఒకటే అర్థం అని సూచిస్తుంది. ఈ విధంగా జీవుడు, ఈశ్వరుడు ఒకటే అనడం అసంబద్ధంగా కనిపిస్తుంది. అందుకే శ్రీరామచంద్రుడు ‘అథ’ ఇప్పుడు అన్న శబ్దాన్ని వాడడు.
26. ప్రత్యక్ పరోక్షాది విరోధమాత్మనోర్
విహాయ సంగృహ్య తయోశ్చిదాత్మతామ్ !
సంశోధితాం లక్షణయా చ లక్షితాం
జ్ఞాత్వాస్వమాత్మాన మధాద్వయో భవేత్ !!
తత్ త్వం పదాల వాక్యార్థాలను స్వీకరించడం ద్వారా కలిగే సందేహాలను విసర్జించు. తత్ అంటే ప్రత్యక్ష అర్థం సర్వ సృష్టికర్త అయిన ఈశ్వరుడు. త్వం అంటే వ్యక్తిగతమైన జీవభావం. స్వభావాలలో వీటిని గల వైరుధ్యాన్ని పరిశీలిస్తుంటే వీటికి ఏకత్వాన్ని తార్కికంగా ఆమోదించలేం. ఈ రెండు పదాలు సూచించే లక్ష్యార్థంలో మాత్రమే వీటికి ఏకత్వం కనిపిస్తుంది.
27. ఏకాత్మకత్వాజ్జహతీ న సంభవేత్
తథాజహల్లక్షణతా విరోధత: !
సో - యమ్ పాదర్థావివ భాగలక్షణా
యుజ్యేత తత్త్వంపద యోరదోషత: !!
మహావాక్యం సూచించే లక్ష్యార్థాన్ని గ్రహించడానికి జహత లక్షణ విధానాన్నిగానీ, అజహత లక్షణ విధానాన్ని కాని ఉపయోగించకూడదని, జహాదజహాల్ల క్షణాన్ని ఉపయోగించాలని శ్రీరామచంద్రుడు చెబుతున్నాడు. దీనినే భాగత్యాగ లక్షణమని కూడా అంటారు.
జహత్ లక్షణమంటే మనం చెప్పినదాంట్లో అనవసరమయిన దానిని త్యజించి, అవతలి వ్యక్తి తెలివిగా అర్థం చేసుకోవడం. అజహల్లక్షణమంటే మనం చెప్పినదానికి మరికొంత కలిపి అర్థం చేసుకోవాలి. జహత్ అజహత్ లక్షణమంటే మనం చెప్పేదాంట్లో కొంచెం త్యజించి, మరికొన్ని అంశాలను కలిపి, మన భావాన్ని అర్థం చేసుకోవాలి.
28. రసాది పంచీకృత భూతసంభవం
భోగాలయం దు:ఖసుఖాది కర్మణామ్ !
శరీరమాద్యన్త వదాది కర్మజం
మాయా మయం స్థూలముపాధిమాత్మన: !!
శ్రీరామచంద్రుడు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను వర్ణిస్తూ నిర్వచిస్తున్నారు. ఆత్మ ఉపాధులచే ఆవరించబడి వాటి ద్వారా వ్యక్తమౌతూ వాటికే పరిమతం కావడం చేత ప్రత్యక్షంగా మనకు కనబడటం లేదు.
స్థూలమయిన శరీరాన్ని కూడా ఈ పంచభూతాల స్థూలాంశాల నుండే ఉద్భవిస్తాయి. పదార్థం ఒక్కటే అయినప్పటికీ, వ్యక్తి ప్రారబ్ధ కర్మలను అనుసరించి, తయారయే శరీరం ఆకృత పరిణామమూ విభిన్నంగా మారుతుంటుంది. మన వ్యక్తిత్వంలో నిక్షిప్తమయి వున్న గత కర్మలను వాసనలని అంటారు. ఈ వాసనలే స్తూల శరీరాకృతిని నిర్ణయిస్తాయి.
29. సూక్ష్మం మనోబుద్ధి దశేంద్రియైర్యుతం
ప్రాణైరపంచీకృత భూతసంభవమ్ !
భోక్తు: సుఖాదే రనుసాధనం భవేత్
శరీర మన్య ద్విదురాత్మనో బుధా: !!
మనస్సు, బుద్ధి, దశేంద్రియాలు, పంచప్రాణాలతో కూడి, పంచ సూక్ష్మభూతాలలో నిర్మింపబడి, జీవునిచే సుఖదు:ఖాలనే అనుభవాలు పొందడానికి ఉపయోగపడే ఆత్మ ఉపాధిని సూక్ష్మశరీరమని బుధులు.. అంటే జ్ఞానమంటారు.
30. అనాద్వనిర్వాచ్య మపీహ కారణం
మాయా ప్రధానం తు పరం శరీరకమ్ !
ఉపాధిభేదాత్తు యత: పృథక్ స్థితం
స్వాత్మానమాత్మన్యవధారయేత్ క్రమాత్ !!
మూడవది, చివరిదీ అయిన ఉపాధిని కారణ శరీరాన్ని శ్రీరామచంద్రులు వర్ణిస్తున్నారు. అనాది, అనిర్వచనీయం అయిన మాయచే నిర్మించబడిన మూడవ ఉపాధిని కారణ శరీరం అని అంటారు. ఆత్మ ఈ ఉపాధులన్నిటికంటే వేరుగా విలక్షణమయింది కాబట్టి సాధకుడు క్రమంగా ఈ ఉపాధులను నిరసిస్తూ వాటికి భిన్నంగా తనలో వున్న ఆత్మని గుర్తించగలగాలి.
(And get your daily news straight to your inbox)
Nov 13 | రామాయణంలో రాముడి చేత సంహరించబడిన రావణుడు.. అంతకుముందే మరొకరి చేతిలో ఓడిపోయాడు. అతడి పేరే మాంధాత. ఇతడు యవనాశ్వుని కుమారుడు. భ్రుగు మహర్షి దాచి ఉంచిన మంత్రజలం సేవించినందువల్ల యవనాశ్వుని భార్యకు మాంధాత జన్మిస్తాడు.... Read more
Oct 08 | పూర్వం జీమూతకేతువు అనే చక్రవర్తికి ‘జీమూతవాహనుడు’ అనే కుమారుడు వుండేవాడు. ఇతను చిన్నప్పటి నుంచి రాజ్య ప్రజలు, అన్నిప్రాణుల పట్లా ఎంతో కారుణ్యంతో ఉండేవాడు. రాకుమారుడు అయినప్పటికీ అతనితో అహంకారం వుండేది కాదు. ఇటువంటి... Read more
Jul 03 | అక్రూరుడికి సంబంధించిన ప్రస్తావన మహాభారతంలో ప్రచురించబడింది. ఇతిహాస కథలలో కొన్ని విచిత్రమైన పాత్రలు ప్రత్యేకంగా చెప్పబడేవి. అందులో కొన్ని పాత్రలు ద్వంద్వ స్వభావాన్ని కనబరిస్తే... మరికొన్ని పాత్రలు ఇరువర్గాలకు నష్టాన్ని కలిగించేలా వుండేవి. అటువంటి... Read more
Jun 14 | పాండవులు, ద్రౌపదికి కలిగిన ఐదుగురు సంతానాన్ని ఉప పాండవులగా పిలుస్తారు. పాండవులకు ఒక్కొక్కరుగా ఒక్కొక్క పుత్రుడు జన్మించారు. 1. ప్రతివింధ్యుడు - (ధర్మరాజు పుత్రుడు)2. శ్రుతసోముడు - (భీముని పుత్రుడు)3. శ్రుతకర్ముడు - (అర్జునుని... Read more
Jun 10 | సరస్వతీదేవిని ప్రతిఒక్కరు ఎంతో దైవంగా పూజిస్తారు. ఈమెను చదువుల తల్లిగా పేర్కొంటారు. సరస్వతీదేవి సన్నిధిల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే.. వారికి చదువు ఎంతో బాగా లభిస్తుందని, భవిష్యత్తు కార్యకలాపాల్లో విజయాలు సాధిస్తారని, జీవిత ప్రయాణంలో... Read more