హిందూ దేవతలలో వినాయకుడిదే అగ్రస్థానం. దేవతలు కూడా తమ పనులను నిర్వర్తించుకునేముందు వినాయకుడిని దర్శించుకుని, విజయాలను సాధించేవారు. అలాగే సామాన్య ప్రజలు కూడా తమరోజువారి పనులలో, కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు, సమస్యలు రాకుండా నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా వినాయకుడిని పూజించుకుంటారు. అతేకాదు.. దక్షిణాయనంలో జరుపుకునే హిందూ పండుగలలో మొదటగా వచ్చేది కూడా వినాయక చవితియే!
అటువంటి వినాయకునికి ఆకులు, పండ్లు, పువ్వులతో కూడిన పత్రి ఆహారాలను తినే ఏనుగు తల కలిగి వుండటం వల్ల గణేశునికి పత్రి అంటే ఎంతో ఇష్టం. అందువల్లే పత్రితో గణేశుని ఆధ్యాత్మికంగా పూజిస్తే అనుగ్రహం కలుగుతుంది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే ఈ పత్రిలో వున్న రకాలు, వాటి ఔషద గుణాల గురించి ఒకసారి తెలుసుకుందాం...
వినాయకునిని ప్రత్యేకించి భాద్రపదమాసంలోనే పత్రితో పూజాకార్యక్రమాలను నిర్వహిస్తారు. ఎందుకంటే.. ఆ మాసంలో వర్షాలు కుండపోతగా కురవడం వల్ల... నలువైపులా కాలువలు, గుంటలు అన్ని నీటితో నిండిపోయి, బురదగా ఏర్పడుతాయి. దాంతో హానికలిగించే సూక్ష్మజీవులు వ్యాప్తి చెందుతాయి. అటువంటి సమయాల్లో వినాయకునికి ఈ పత్రితో పూజచేయడం వల్ల.. గృహంలో వాతావరణం బాగా వుండటంతోపాటు వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులు కూడా నామరూపాలు లేకుండా అంతమవుతాయి.
సాధారణంగా పత్రి అంటే పండ్లు, ఆకులు, పూలతో కూడిన పదార్థాల సముదాయం. సహజంగానే ఇటువంటి పదార్థాలలో మానవుని శరీరానికి కావలసిన ఔషధ గుణాలు ఎన్నో వుంటాయి. మరికొన్ని అయితే కేవలం వాటి తాకిడి స్పర్శతోనే రోగాలను నయం చేసే శక్తిని కలిగి వుంటాయి. కొన్ని ఆకులు అయితే ఆరోగ్యకరమైన సుగంధ పరిమళాలను వెదజల్లుతూ.. మానవునికి కావలసిన ప్రాణవాయువును కూడా అందిస్తాయి. అందులో ముఖ్యమైనవి తులసీ, గరిక, నేరేడు, మారేడు, మరువం, ఉమ్మెత్త, ఉత్తరేణి మొదలైనవన్నీ ఔషధ గుణాలున్న పత్రాలు.
1. తులసి... తులసి గురించి తెలియనివారు ఎవ్వరూ వుండరు. చాలావరకు వీటిని ఇంటిగుమ్మం ముందు నిర్మించుకుని ప్రతిరోజూ ఉదయాన్నే పూజలు నిర్వహించుకుంటారు. ఇది ముఖ్యం కఫం వంటి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగించడంలో ప్రముఖపాత్రను వహిస్తుంది.
2. జిల్లేడు... ఇది మానవ శరీర ఆరోగ్యానికి దోహదపడే ఏకైక ఔషధం. చర్మవ్యాధులు, శ్వాసకోశ వ్యాధులను నయం చేయడంలో ముఖ్యపాత్రను వహిస్తుంది. బలహీనమైన నరాలను ఉత్తేజపరుస్తుంది. ఈ జిల్లేడు ఆకులవల్ల శరీరంలో వున్న దోషాలు మటుమాయమవుతాయి.
3. రేగు... ఇందులో ముఖ్యంగా ఆకులనే పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. కేశవ్యాధులు, అతిసారం, రక్తదోషాల నుంచి విముక్తి కలిగిస్తుంది.
4. మరువం... శ్వాస తీసుకోవడంలో కలిగే ఇబ్బందులను, చెవిటికి సంబంధించిన వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. నిరుత్సాహంగా వున్నవారిని ఆహ్లాదకరంగా మార్చేస్తుంది.
5. రావి... మానసిక ఒత్తిళ్లనుంచి దూరం చేసి, ప్రశాంతతను కలిగిస్తుంది.
6. దానిమ్మ... దీని పూలు, కాయలు, బెరడు మొదలైనవాటిని ఆయుర్వేదంలో ఔషధాలుగా ఉపయోగిస్తారు. నీటివిరేచనాల సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
7. ఉత్తరేణి... ఇందులో సౌందర్య రహస్యాలకు సంబంధించిన ముఖ్యమైన ఔషధగుణాలు కలిగి వుంటాయి. సహజంగా ప్రతిఒక్కరు దీనిని మొహం కడుక్కోవడానికి ఉపయోగిస్తారు.
8. బిల్వపత్రం... మానవ శరీరానికి హాని కలిగించే సూక్ష్మక్రిములను నివారించడంలో ముఖ్యపాత్రను పోషిస్తుంది. అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధుల నుంచి సంరక్షిస్తుంది.
9. నేరేడు... వీటి ఆకుల నుంచి వీచే గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిది. నేరేడు కాయ అతిముత్ర వ్యాధిని నివారిస్తుంది.
10. మారేడు... సకల దోషాలు, పాపాలను హరిస్తుంది. జీవితంలో వున్న కష్టాలను దూరంచేస్తుంది.
11. గరిక... శ్వాస తీసుకోవడంలో, ముక్కు సంబంధిత అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.
12. మాచీ పత్రి... మానవునిలో దాహాన్ని పూర్తిగా తగ్గించేస్తుంది. వ్రణాలు, దద్దర్లు, వాత రోగాలు, జ్వరాలను తగ్గించి.. నిత్యం ఆరోగ్యంగా వుండేందుకు సహకరిస్తుంది.
13. జమ్మి... దీనిని దసరా పండుగలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కఫ, శ్వాస రోగాలను తగ్గించడంలో వీటి ఆకులు, బెరడు ముఖ్యపాత్ర వహిస్తాయి.
14. మునగాకు... శ్వాస ప్రక్రియలో వుండే ఇబ్బందులను అంటే.. కఫాన్ని, వాతాన్ని తగ్గించి హాయిగా వుండేందుకు సహకరిస్తుంది.
ఇలా ఈ విధంగా గణపతి పూజలో ఉపయోగించే పత్రి ఉపయోగాలు చెప్పుకుంటూపోతే చాలానే వున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jun 12 | హిందూ శాస్త్రాలలో పాదరసం ప్రాముఖ్యత - మహిమలు : పూర్వం దేవతల కాలంనుంచి పాదరసానికి ఎంతో ప్రత్యేకత వుంది. పాదరసం అసలు పేరు ‘‘ఏఅసరాజు’’. ఇది చూడడానికి దేవతామూర్తుల రూపంలో కనువిందు చేస్తుంటుంది. ప్రాచీనకాలంలో... Read more
Apr 18 | అమృత ప్రాప్తి మంత్రం : శంఖినీ యక్షిణీ సాధన మంత్రం శంఖ ధారడీ శంఖ ధరనే హ్యీం హ్యీం క్లీం శ్రీ స్వాహా ఈ మంత్రాన్ని వటవృక్షం కింద కూర్చుని పదివేలసార్లవరకు జపించాలి. దీనిని... Read more
Apr 03 | కార్తీకమాసంలో ఎంతో పవిత్రమైన, విశిష్టమైన క్షీరాబ్ది ద్వాదశిరోజు తులసీ పూజను నిర్వహించుకుంటారు. కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్షద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈరోజు ముత్తైదువులు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలను భక్తిశ్రద్ధలతో పూజించి, వారి వివాహాన్ని జరుపుకుంటారు. ఆ... Read more
Mar 19 | భీష్మపితామహుడికి సంతానం లేకపోయినా... ఆయన మరణించిన తరువాత ఇప్పటికీ పితృతర్పణాలు అందుతూనే వున్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భీష్ముడు భారతకథలో నిలిచిపోయిన మహోన్నతుడు. ఈయనకు ఇంత మహత్యం లభించడానికి కారణం ఆయన గుణశీలాలే. 45రోజులపాటు... Read more
Mar 15 | ఆశ్వయుజ అమావాస్యనాడు... అంటే దీపావళి ముగిసిన రెండురోజుల తరువాత కార్తీకమాసం మొదలవుతుంది. ఈ కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈరోజుని వారు శివరాత్రితో సమానమైన పర్వదినంగా కొలుచుకుంటారు. ఈ పర్వదినాన్ని... Read more