ద్వాపర కలియుగ సంధికాలంలోని శుక్ల సంవత్సరంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమినాడు శ్రీకృష్ణుడు కంసుడి చెరసాలలో జన్మించాడు. శ్రావణమాసంలో దేవకి, వసుదేవులకు ఇతను ఎనిమిదో సంతానంగా పుట్టాడు.
శ్రీకృష్ణుడు జన్మదినం సందర్భంగా జరుపుకునే పండుగ కాబట్టి దీనిని కృష్ణాష్టమి అంటారు. కృష్ణజయంతి, శ్రీ జయంతి అని కూడా కొందరు పిలుచుకుంటారు. కృష్ణాష్టమి పూజను నిర్ణయించుకునేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే.. మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు.
కృష్ణాష్టమి పూజావిధానం :
కృష్ణాష్టమి సందర్భంగా ఉదయాన్నే లేచి రోజువారి కార్యక్రమాలను ముగించుకున్న తరువాత అభిషేక స్నానాన్ని ఆచరించాలి. తులసీదళాలు వేసిన నీటితో ఆచమించాలి. సాధ్యమైనంతవరకు ఆరోజు ఉపవాసం వుండేలా ప్రయత్నించాలి. ఇలా ఉపవాసం వుండడం తప్పనిసరియైన ఆచారం.
సాయంత్ర సంధ్యాకాలంలో గృహమధ్యమున గోమయంతో ఆలికి రంగవల్లి తీర్చాలి. దానిమీద బియ్యం పోసి ఒక మంటపాన్ని ఏర్పరుచుకుని నూతన కుంభం వుంచాలి. ఆ కొత్త కుండను గంధపుష్పాక్షతలచే అలంకరించాలి. దానికి వస్త్రం చుట్టాలి. తరువాత ఆ కలశం మీద బాలకృష్ణుని ప్రతిమను ప్రతిష్టించుకోవాలి.
అయితే ముందుగా దేవకీదేవ ప్రార్థనను ముగించుకున్న తరువాత కృష్ణుని ప్రార్థన కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. వేయించిన మినపపిండితో పంచదార కలిపి నైవేద్యం చేసి, తరువాత దేవకీదేవకి నివేదనం చేయాలి.
శ్రీకృష్ణుని పూజ అర్థరాత్రి వరకు నిర్వహించుకోవాల్సి వుంటుంది. పూజలో కృష్ణుడికి నైవేద్యంగా ముఖ్యమైన పాలు, పెరుగు, వెన్నలను సమర్పించుకోవాలి. చంద్రోదయ సమయంలో బయటకు వెళ్లి... అలంకృతమైన భూమిలో ఫలపుష్పచందన సంయుక్తమైన శంఖంచేత నీటిని తీసుకుని చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి.
ఈ పండుగనాడు వెండితో తయారుచేసిన చంద్రుడి ప్రతిబింబానికి పూజాదికాలతో ఆర్ఘ్యం ఇస్తే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని మన పూర్వీకుల నమ్మకం.
తర్వాత శంఖం చేత నారికేళోదకం గ్రహించి కృష్ణుడికి అర్ఘ్యమివ్వాలి. ఆ రాత్రి భగవంతుని కథలతో జాగరణం, మరునాడు భోజనం చేసి, ఉపవాసాన్ని విరమించుకోవాలి.
ఒకవేళ ఇదంతా చేయడం సాధ్యం కాకపోతే.. కనీసం శ్రీ క్రిష్ణుని ప్రతిమ లేదా పటానికి షోడశోపచార పూజ చేసి కృష్ణునికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, మీగడ లు నివేదించాలి. దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేయాలి.
పాపపుణ్యాల గురించి ఎటువంటి అనుభవాలు తెలయని బ్రహ్మస్వరూపపు బాలలలో ద్యోతకమయ్యే దివ్యత్వాన్ని బయటపెట్టే కార్యకలాపం గల పండుగ ఈ కృష్ణాష్టమి.
ఈ విధంగా శ్రీకృష్ణాష్టమి పూజలను నిర్వహించుకోవాలి.
(And get your daily news straight to your inbox)
Jun 12 | హిందూ శాస్త్రాలలో పాదరసం ప్రాముఖ్యత - మహిమలు : పూర్వం దేవతల కాలంనుంచి పాదరసానికి ఎంతో ప్రత్యేకత వుంది. పాదరసం అసలు పేరు ‘‘ఏఅసరాజు’’. ఇది చూడడానికి దేవతామూర్తుల రూపంలో కనువిందు చేస్తుంటుంది. ప్రాచీనకాలంలో... Read more
May 10 | హిందూ దేవతలలో వినాయకుడిదే అగ్రస్థానం. దేవతలు కూడా తమ పనులను నిర్వర్తించుకునేముందు వినాయకుడిని దర్శించుకుని, విజయాలను సాధించేవారు. అలాగే సామాన్య ప్రజలు కూడా తమరోజువారి పనులలో, కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు, సమస్యలు రాకుండా నిర్విఘ్నంగా... Read more
Apr 18 | అమృత ప్రాప్తి మంత్రం : శంఖినీ యక్షిణీ సాధన మంత్రం శంఖ ధారడీ శంఖ ధరనే హ్యీం హ్యీం క్లీం శ్రీ స్వాహా ఈ మంత్రాన్ని వటవృక్షం కింద కూర్చుని పదివేలసార్లవరకు జపించాలి. దీనిని... Read more
Apr 03 | కార్తీకమాసంలో ఎంతో పవిత్రమైన, విశిష్టమైన క్షీరాబ్ది ద్వాదశిరోజు తులసీ పూజను నిర్వహించుకుంటారు. కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్షద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈరోజు ముత్తైదువులు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలను భక్తిశ్రద్ధలతో పూజించి, వారి వివాహాన్ని జరుపుకుంటారు. ఆ... Read more
Mar 19 | భీష్మపితామహుడికి సంతానం లేకపోయినా... ఆయన మరణించిన తరువాత ఇప్పటికీ పితృతర్పణాలు అందుతూనే వున్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భీష్ముడు భారతకథలో నిలిచిపోయిన మహోన్నతుడు. ఈయనకు ఇంత మహత్యం లభించడానికి కారణం ఆయన గుణశీలాలే. 45రోజులపాటు... Read more