ఇప్పటివరకు రాజకీయ నాయకులుగా ప్రజల మనసును గెలుచుకున్న నాయకులు ఇద్దరే. ఒకరు నటుడు నందమూరి రామారావు, మరోకరు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఈ ఇద్దరికి తెలుగు ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈరోజు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 64వ జయంతి వేడుకలు వైసీపీ పార్టీలో, వైఎస్ అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకల సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల కూడా రక్తదానం, ఉచిత వైద్యసేవలు, పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. వైయస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని సమాధిస్థలి దగ్గర అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి వైయస్ భారతి, వైయస్ కొండారెడ్డి తదితరులు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్కు వెళ్ళి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టింది. 9.30 గంటలకు మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో అల్షిఫా మానసిక వికలాంగుల కేంద్రంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ.
10 .00గంటలకు ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో పద్మ మానసిక పునరావాస కేంద్రంలో దుప్పట్ల పంపిణీ.
10.30 గంటలకు నగర మహిళా విభాగం ఆధ్వర్యంలో రాస్ స్వచ్ఛంధ సంస్థలో పండ్లు పంపిణీ.
10.45 గంటలకు శంకరాపురంలోని అంధుల పాఠశాలలో వైఎస్సార్ సీపీ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ
11.00 గంటలకు అమ్మ ఒడిలో జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ
11.30 గంటలకు రిమ్స్లో వైఎస్సార్ టీయూసీ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ.
11.45 గంటలకు సాయిబాబా అనాథ శరణాలయంలో ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో అన్నదానం.
12.15 గంటలకు ఆర్తీహోంలో నగర యువజన విభాగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.
12.30 గంటలకు అంధుల పాఠశాలలో రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తార. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా తెలుగువిశేష్ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంది....
(And get your daily news straight to your inbox)
Feb 20 | పరిచయం : తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేసుకుని అద్భుతమైన హాస్యాస్పద చిత్రంగా చరిత్రలోనే నిలిచిపోయింది ‘‘మిస్సమ్మ’’. ఈ చిత్రం 1995వ సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమాలో తెలుగు చిత్రపరిశ్రమలోనే మహాదిగ్గజాలైన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు,... Read more
Feb 19 | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గర్వించదగిన సినిమా ‘‘మాయాబజార్’’. ఈ చిత్రం 1957లో మార్చి 7వ తేదీన ఆంధ్రదేశమంతటా విడదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. 2007వ సంవత్సరం నాటికి ఈ సినిమా 50 ఏళ్లు పూర్తి... Read more
Jan 18 | నవరస నటనా సార్వభౌమునిగా పేరుగాంచిన స్వర్గీయ నందమూరి తారకరామారావు 1923 మే 28న క్రిష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకాకు చెందిన నిమ్మకూరులో అతి పేద కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుండే సంగీతం పై మక్కువ... Read more
Dec 18 | అర్ధశతాబ్దిగా ఆ పేరు తెలుగునాట ఇంటింటి పేరు. సాహిత్య కళారంగాలలో ప్రజ్ఞ ప్రఖ్యాతి గాంచినవారు. కారం చమత్కారం మమకారం తగుపాళ్లలో పంచినవారు. ఆయన ఒక్కరు కాదు ఇద్దరు. తెలుగువారు బాపుని రమణని విడివిడిగా అభిమానించారు.... Read more
Dec 02 | ఆయన పాట వింటే తనువు పులకించిపోవాల్సిందే. మధురగాయకుడు మహమ్మద్ రఫీ తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో పాడారు. ఆయన తొలిసారిగా నాగయ్య నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన 'భక్త రామదాసు' చిత్రంలో పాడారు. అయితే ఆ... Read more