కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా సొంతపార్టీపైనే విమర్శలు గుప్పించి మరీ టీఆర్ఎస్ లో చేరడం వెనక ఆంతర్యం మాట అటుంచి, రాజకీయ భవిష్యత్తు కోసమే తాము పార్టీ మారమంటూ ప్రకటించేయటంపై తీవ్ర చర్చ మొదలౌతుంది.
గత కొద్దికాలంగా జిల్లాలో నెలకొన్న గ్రూపు తగాదాలు ఎక్కువైన నేపథ్యంలోనే వారంతా పార్టీ మారినట్లు తేటతెల్లమౌతోంది. ముఖ్యంగా సీనియర్ నేతలుగా ఉన్న జానా, గుత్తా, కోమట్ రెడ్డి, ఉత్తమ్ ల మధ్యే ఇంతకాలం ఆధిపత్య పోరు జరిగిందని అర్థమౌతోంది. పీసీసీ చీఫ్, సీఎల్ పీ వంటి కీలకపదవులు ఈ జిల్లాకే చెందినప్పటికీ ఆయా కీలకనేతల మధ్య జరుగుతున్న వార్ తో పార్టీ ఉనికికే ముప్పు తెచ్చే పరిస్థితి దాపురించింది. నిజానికి అధిష్ఠానం వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని ప్రతిపక్షంలో ఉన్న ఈ నలుగురు నాయకులు పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలే చేశారు. వారిలో ఇద్దరు మాత్రమే సక్సెస్ కాగలిగారు. ఇది గిట్టకే పాల్వాయి లాంటి సీనియర్ నేతలు జానారెడ్డి లాంటి వారిపై బహిరంగంగానే విరుచుకుపడ్డారు. పైగా తరచూ అధికార పక్షాన్ని పొగడటంతో పార్టీకి కూడా కాస్త ఇబ్బందిగానే తొచింది. అయినప్పటికీ దిద్దుబాటు చర్యలకు దిగకపోవటం విశేషం.
ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఓడించేందుకు ఓ వర్గం నేత లు తీవ్రంగా ప్రయత్నించారని సమాచారం. అయితే జిల్లాలో వారి కున్న పట్టు ఆర్థికంగా అన్ని హంగులు ఉండడంతో సునాయాసంగానే ఆయన విజయం సాదించారు. తద్వారా రాబోయే రోజుల్లో ఏ ఎన్నికల్లో పోటీ చేసినా తమదే విజయమని కోమటిరెడ్డి బ్రదర్స్ సంకేతాలు పంపారు. ఇక్కడ మరో విమర్శ ఏంటంటే... ఆయా కీలక నేతలు పార్టీ కార్యక్రమాలను తమ నియోజకవర్గంలో మాత్రమే సక్సెస్ చేస్తూ... ఇతర నియోజక వర్గాలలో మాత్రం నాయకుల మద్య తగాధాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పటికి తనకంటూ ఓ ప్రత్యేకవర్గం లేదని భావించిన గుత్తా ఇటీవలే కొంతమంది నాయకులను ప్రోత్సహించడం ప్రారంభించాడు. చివరికి వారి సలహా మేరకే అధికార పక్షంలో చేరారన్న టాక్ కూడా ఒకటి వినిపిస్తోంది. దీంతో మిగిలిన ముగ్గురు పరిస్థితి ఏంటా అన్నది ప్రశ్నగా మారింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకి జిల్లాలో ఎంతటి ప్రాధాన్యం ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బలహీనంగా ఉన్న ఆయన్ను మరింత దిగజార్చేందుకు ఈ గ్రూప్ రాజకీయాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు అసలు పోటీ జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. కీలక పదవో లేక సీఎం పదవి మీద ఆశో తెలీదు గానీ రాబోయే రోజుల్లో ఈ రాజకీయ పోరుతో పార్టీకి మాత్రం నష్టం వాటిల్లడం ఖాయంగా కనిపిస్తోంది.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more
Jun 04 | సినీ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సీరియల్ లో నటించే హీరోయిన్స్ సైతం ఎదో ఒకరకంగా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పైగా హీరోయిన్స్ కి మేము ఏమాత్రం తీసిపోము అంటూ... Read more