చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో కాదు సత్రశాల మల్లిఖార్జన స్వామి దేవాలయం. ఈ అత్యంత ప్రవిత్రమైన ప్రాంతంలో యోగరుషి బ్రహర్షి విశ్వామిత్రులు యాగం చేశారు. అయితే ఆయన యాగం చేసే క్రమంలో కాకులు ఈ ప్రాంతంలో వాలి శబ్దం చేసాయట. దీంతో తన యాగానికి భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో విశ్వామిత్రులు ఆగ్రహించి.. ఈ ప్రాంతంలో కాకులు వాలితే వెంటనే చనిపోవుగాక అంటూ బ్రహర్షి శపించారట. ఇది పురాణకథలో పేర్కోనబడివుంది.
దీంతో ఈ సత్రశాల దేవాలయంలో కాకులు వాలవని భక్తులు నమ్మకం. భక్తులు ఆరాధించే మల్లికార్జునుడు స్వయం భూలింగం. ఇక ఈ దేవాలయంలో నిత్యం ఓంకార ధ్వని ప్రతిధ్వనిస్తుంది. శ్రీరాముడు, లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షి, అన్నమాచార్యులు పూజించి తరించిన క్షేత్రం. విశ్వామిత్రుడు బ్రహర్షి కావాలనే కాంక్షతో ఈ ప్రాంగణంలో సత్రయాగం చేయడం వల్ల ఈ ప్రదేశానికి సత్రశాలగా పేరు పెట్టినట్లు పూర్వీకులు చెపుతారు. ఆలయ ప్రాంగణంలో శివ, శైవ క్షేత్ర భేదాలు లేకుండా వెలిశాయి.
భ్రమరాంబ, మల్లయ్య, కుమార, వెంకటేశ్వరస్వామి, కాశీ అన్నపూర్ణ, విశ్వేశ్వరుడు, కాలభైరవుడు, చీకటి మల్లయ్య, ఆంజనేయుడు, అమరలింగేశ్వరుడు, సంతాన మల్లయ్య, చెన్నకేశవుడు, ఉత్తరేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించి ఉన్నాయి. అయితే ఎక్కడా లేని విధంగా ఇక్కడ బ్రహ్మదేవుడికి కూడా ఆలయం నిర్మించి వుండటం విశేషం. అతిపెద్ద ఏకాశిల నందీశ్వరుని విగ్రహం సత్రశాలలో నెలకొల్పారు. శివరాత్రి పర్వదినంతో పాటు కార్వీకమాసంలో భక్తులు ఇక్కడకు పెద్ద సంఖ్యలో వస్తారు. సత్రశాలకు వచ్చే యాత్రికులకు సకల సౌకర్యాలను ఆలయ కమిటీ కల్పించనుంది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more
Dec 29 | స్నానాలు అచరించడం అంటే స్నానం చేయడమనే అర్థం వచ్చినా.. స్నానానికి ప్రాధాన్యత ఎంతో వుంది. స్నానాలు ఎలా చేయాలి, ఎంత సేపు చేయాలి, ఎప్పుడు చేయాలి.. ఏ నీళ్లతో చేయాలి.. ఎక్కడ స్నానాలు చేయడం... Read more