Computers Stolen From Kodela's House ఏపీ స్పీకర్ కోడెల నివాసంలో చోరి..

Computers theft in former speaker kodeal shivaprasad house

Computers Stolen From Kodela’s House Before Search Operation, Twist to case in kodela case furniture stealing, Kodela Siva Prasad Rao furniture, furniture stolen by former speaker, assembly furntiure stolen by kodela siva prasad rao, computers stolen from kodelas house, kodela assembly furniture controversy, kodela shiv prasad, former speaker, Legislative Assembly, Furniture, Computers, guntur, Andhra Pradesh, Crime

Just hours before Assembly authorities were likely to conduct searches in the house of former Speaker Kodela Siva Prasad Rao at Narasaraopet in Guntur, Kodela's staff have claimed that there was a robbery in the house and two computers were stolen.

ఏపీ స్పీకర్ కోడెల నివాసంలో చోరి.. కంపూటర్లు గయాబ్

Posted: 08/23/2019 10:50 AM IST
Computers theft in former speaker kodeal shivaprasad house

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు నివాసంలో చోరీ జరిగింది. గత రాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని కోడెల ఇంటికి చేరుకున్నారు. విద్యుత్ మరమ్మతు పనులు చేయాలంటూ లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లోంచి కంప్యూటర్లు పట్టుకుని పరారయ్యారు. గేటు వద్ద ఉన్న వాచ్ మన్ వారిని ఆపేందుకు ప్రయత్నించగా తోసేసి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.  

అయితే దొంగతనం కూడా రాజకీయం సంతరించుకుంది. బయటి వ్యక్తులు మరమ్మతుల పేరుతో కొడెల ఇంట్లోకి వెళ్లి కంప్యూటర్లను ఎలా తీసుకెళ్తారని, అయినా ఆ సమయంలో ఇంట్లని వ్యక్తులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ నుంచి ఫర్నీచర్ తరలిపు సందర్భంలో తాను కొంత ఫర్నీచర్ ను తన నివాసానికి తరలించానని, అందుకు ఎంత ఖర్చవుతుందో అంతా ఇచ్చేస్తానని చెప్పిన కోడెల ఆ సమాచారం ఎవరికీ అందకుండా కంప్యూటర్లను తనవారి చేతే దొంగతనం డ్రామాకు తెరలేపారా.? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

కాగా, ఈ సందేహాలపై కోడెల స్పందించారు. కొందరు వ్యక్తులతో పాటు కొన్ని మీడియా సంస్థలు తన ఇంట్లోని ఫర్నిచర్‌ చోరీ జరిగిందని, దుర్వినియోగం అవుతోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కోడెల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న ఫర్నిచర్‌ విషయంలో ఎటువంటి కంగారు అక్కర్లేదని, ప్రతి వస్తువుకు తనవద్ద లెక్క ఉందని తెలిపారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని ముందు నుంచీ చెబుతూ వస్తున్నానని, ఫర్నిచర్ కు సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని, వాటిని అప్పగించడమా, డబ్బు చెల్లించడమా తేల్చిచెప్పాలని కోరానని గుర్తు చేశారు. అయినా కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles