‘ఐఎన్ఎక్స్ మీడియా’ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించడంతో చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమిళనాడులో దాదాపు 18 గంటల పాటు అదృశ్యమయ్యారు. ఆయన కోసం సీబీఐ అధికారులు గాలింపును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. చిదంబరం వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. ఇందుకోసం వెన్నెముకలేని మీడియాను వాడుకుంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ తరహాలో అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని తాను ఖండిస్తున్నట్లు చెప్పారు.
దేశానికి సేవ చేసిన వ్యక్తి పట్ల ఇలానా వ్యవహరించేది.?: ప్రియాంక
చిదంబరంతో సీబీఐ వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. ఎన్నో ఏళ్ల పాటు దేశానికి సేవ చేసిన వ్యక్తి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా దేశానికి చిదంబరం సేవ చేశారని... కేంద్ర ఆర్థిక, హోం మంత్రిగా బాధ్యతలను నిర్వహించారని చెప్పారు. నిజాలను నిర్మొహమాటంగా మాట్లాడటం ఆయన నైజమని... కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగడుతున్నారని అన్నారు. కొందరు పిరికిపందల వల్ల నిజాలు మాట్లాడే వారిపై నిందలు పడుతున్నాయని వ్యాఖ్యానించారు. చిదంబరం పట్ల సీబీఐ అవమానకరంగా ప్రవర్తిస్తోందని ప్రియాంక విమర్శించారు. ఆయనకు తామంతా మద్దతుగా నిలుస్తామని... ఎన్ని అడ్డంకులు ఎదురైనా బెదరబోమని... న్యాయం కోసం పోరాడుతామని చెప్పారు.
రాజకీయ కక్షతోనే చిదంబరం అరెస్టుకు ఉబలాటం:
కష్టకాలంలో కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరానికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ బాసటగా నిలబడ్డారు. చిదంబరంను అరెస్టు చేయడానికి సీబీఐ, ఈడీ చేస్తున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు. రాజకీయ క్షకతోనే చిదంబరం అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు సీబీఐ జరుపుతున్న ప్రయత్నాలపై మీడియా అడిగిన ప్రశ్నకు స్టాలిన్ సమాధానమిస్తూ, చిదంబరం న్యాయ నిపుణుడని, ఆయన లీగల్గానే పరిస్థితులను ఎదుర్కోగలరని స్టాలిన్ అన్నారు. జమ్మూకశ్మీర్లో అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలన్న డిమాండ్పై డీఎంకే గురువారంనాడు ఢిల్లీలో నిరసన చేపట్టనుందని, తమ ఎంపీలకు డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత టీఆర్ బాలు నాయకత్వం వహిస్తారని చెప్పారు. ఉదయం 11 గంటలకు జరిగే నిరసన కార్యక్రమంలో 14 పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొంటారని స్టాలిన్ తెలిపారు.
మాల్యా, నిరవ్ మోదీలా ప్రవర్తిస్తున్న చిదంబరం: బిజేపీ
దేశం వదిలి పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీలతో కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని బీజేపీ పోల్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం సెంట్రల్ ఏజెన్సీలతో సహకరించడం లేదని, కేసు దర్యాప్తునకు సహకరించకుండా విజయ్ మాల్యా, నీరవ్ మోదీలా ఆయన ప్రవర్తిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రతినిధి జీవీఎల్ నరసింహ రావు విమర్శించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తాజా పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.
స్వేచ్ఛగా ఐఎన్ఎక్స్ మీడియా కేసును ఎదుర్కొనేందుకు కాంగ్రెస్కు ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినప్పటికీ చిదంబరం మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదన్నారు. దర్యాప్తు సంస్థలకు ముఖం చాటేసి దేశం వదిలి పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ తరహాలో చిదంబరం వ్యవహరిస్తున్నారని, ఇదెంత మాత్రం సరికాదని ఆయన అన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలని చిందబరం పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో జీవీఎల్ నరసింహా తాజా వ్యాఖ్యలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more