కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన సతీమణి సునంద పుష్కర్ ఢిల్లీలోని ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. 2014 జనవరిలో సునంద ఆత్మహత్యకు సంబంధించిన కేసుకు గల కారణాలను ఢిల్లీ పోలీసులు న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. సునంద తీవ్ర మానసిక వేదనతో సునంద ఆత్మహత్యకు పాల్పడినట్టు ఢిల్లీ పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. పోస్ట్మార్టం నివేదిక ప్రకారం సునంద బాడీలో విషం ఉందని, శరీరంపై కాళ్లు, చేతులు, మణికట్టుతో సహా 15 చోట్ల గాయాలు ఉన్నాయని కోర్టుకు తెలియజేశారు.
భర్త శశిథరూర్ తోనూ సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురైందని పేర్కోన్నారు. దీనికి తోడు శశిధరూర్, పాకిస్థానీ మహిళా జర్నలిస్టు మెహర్ తరార్తో సన్నిహితంగా ఉండటం కూడా సునందను మానసిక వేదనకు గురిచేసిందని పోలీసులు నివేదికలో పేర్కోన్నారు. న్యాయమూర్తి అజయ్ కుమార్ కున్హార్ ముందు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ వాదనలు వినిపిస్తూ, పోలీసుల నివేదికను అందజేశారు. తెలిపారు. అంతేకాదు, సునందను థరూర్ వేధింపులకు గురిచేశారని... ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు ఆమె పాల్పడ్డారని వారు ఆరోపించారు.
సునంద స్నేహితురాలు, జర్నలిస్ట్ నళిని సింగ్ వాంగూల్మం సైతం ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు సునంద తనకు ఫోన్ చేసి చెప్పిన అంశాలను ఇందులో వివరించారు. కాగా, సునంద ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న శశిథరూర్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 498-ఏ, 306 కింద కేసులు నమోదై ఉన్నాయి. థరూర్ తరఫున సీనియర్ లాయర్ వికాస్ పహ్వా వాదనలు వినిపిస్తూ.. తన క్లయింట్ అలాంటి మెయిల్స్ పంపిన దాఖలాలు లేవని అన్నారు. అనంతరం కేసును ఆగస్టు 31కి న్యాయమూర్తి వాయిదా వేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more